NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / వీసాల జారీలో భారత్ మా మొదటి ప్రాధాన్యత: అమెరికా
    తదుపరి వార్తా కథనం
    వీసాల జారీలో భారత్ మా మొదటి ప్రాధాన్యత: అమెరికా
    వీసాల జారీలో భారత్ మా మొదటి ప్రాధాన్యతని చెప్పిన అమెరికా

    వీసాల జారీలో భారత్ మా మొదటి ప్రాధాన్యత: అమెరికా

    వ్రాసిన వారు Stalin
    Feb 22, 2023
    09:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయులకు వీసాలు జారీ అంశంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. వీసాల జారీ విషయంలో భారత్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పింది. కరోనా తర్వాత దేశవ్యాప్తంగా వీసా ప్రాసెసింగ్‌ సుమారు 36 శాతం పెరిగినట్లు పేర్కొంది.

    ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్‌లోని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ట్ వీసాల జారీపై మాట్లాడారు.

    అలాగే వీసాల కోసం వేచి ఉండే సమయంలాన్ని కూడా చాలా వరకు తగ్గించినట్లు జూలీ వివరించారు. గతేడాది కంటే ఈ ఏడాది దాదాపు 36శాతం ఎక్కువ వీసాలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.

    వీసా

    అమెరికా, భారత ప్రజల మధ్య బలమైన సంబంధాలు: అమెరికా

    హెచ్-1, ఎల్-1 వీసాల జారీతో పాటు పునరుద్ధరణ కోసం అమెరికాలో వీసా స్టాంపింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు స్టఫ్ట్ ప్రకటించారు. పైలట్ ప్రాతిపదికన కొన్ని కేటగిరీల్లో దేశీయ వీసా రీవాలిడేషన్‌ను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

    హెచ్1బీ, 'ఎఫ్' వీసాల కోసం నిరీక్షణ సమయం దాదాపు ఆరు నెలల క్రితం ఎక్కువగా ఉండేదని చెప్పారు. ఇప్పుడు చాలా వరకు తగ్గినట్లు వివరించారు.

    అమెరికా, భారత ప్రజల మధ్య అత్యంత బలమైన సంబంధాలు ఉన్నాయని డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ నాన్సీ జాక్సన్ పేర్కొన్నారు. ప్రజల మధ్య సంబంధాలను మరింత విస్తరించడానికి కృషి చేస్తామని వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వీసాలు
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    భారతదేశం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    వీసాలు

    భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో తుపాకీ మోత, 10 మంది మృతి అంతర్జాతీయం
    ఉద్యోగులు చేసిన తప్పిదం వల్లే విమానాలు నిలిచిపోయాయి: ఎఫ్ఏఏ విమానం
    అమెరికా: మరో మూడు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు, 9మంది మృతి తుపాకీ కాల్పులు
    ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం చంద్రుడు

    భారతదేశం

    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కెనడా
    ఎయిర్ ఇండియా చారిత్రక ఒప్పందం: 34బిలియన్ డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఆర్డర్ ఎయిర్ ఇండియా
    భారతదేశంలో ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం కానున్న Xiaomi TV Stick 4K అమ్మకాలు టెక్నాలజీ
    మారుతి సుజుకి సియాజ్ కొత్త ఫీచర్లతో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025