NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు
    కుప్పంలో చంద్రబాబు రోడ్‌షోలు, సభలకు అనుమతి నిరాకరణ

    కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు

    వ్రాసిన వారు Stalin
    Jan 04, 2023
    09:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పోలీసులు షాకిచ్చారు. బుధవారం నుంచి మూడు రోజుల‌పాటు చంద్రబాబు కుప్పంలో రోడ్‌షోలు, బహిరంగ సభలను నిర్వహించాల్సి ఉంది.

    అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో చంద్రబాబు రోడ్‌షోలు, బహిరంగ సభలకు చిత్తూరు పోలీసులు అనుమతి నిరాకరించారు. అందరూ కొత్త ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని ఈ మేరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

    వాస్తవానికి చంద్రబాబు మంగళవారం రాత్రి 10.30 గంటల వరకు పోలీసుల అనుమతి కోసం వేచిచూశారు. కానీ పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.

    కుప్పం నియోజకవర్గంలో రోడ్‌షోలు, బహిరంగ సభలు ఎవరు నిర్వహించినా.. అందులో పాల్గొన్నా నిబంధనలను ఉల్లంఘించినట్లే పరిగణిస్తామని పలమనేరు డీఎస్పీ ఎన్.సుధాకర్ రెడ్డి చెప్పారు.

    చంద్రబాబు

    టీడీపీ గ్రామసభ

    కొత్త ఉత్తర్వుల మేరకు పోలీసులు రోడ్‌షోలు, బహిరంగ సభలకు అనుమతి నిరాకరించడంతో.. టీడీపీ గ్రామ సభను చంద్రబాబు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    ఇటీవల చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి.. పలువురు మృతి చెందారు. కందుకూరులో 8మంది, గుంటూరులో ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    ఒకవేళ.. రోడ్ షోలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వాలనుకుంటే.. అరుదైన సందర్భాల్లో.. షరతులతో కూడిన అనుమతి ఇస్తామని హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    చంద్రబాబు నాయుడు

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు భారతదేశం
    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ భారతదేశం
    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ వై.ఎస్.జగన్
    2022లో మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులు ఇవే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025