NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత
    తదుపరి వార్తా కథనం
    12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత
    12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించినట్లు చెప్పిన సీఎం మమతా బెనర్జీ

    12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత

    వ్రాసిన వారు Stalin
    Jan 10, 2023
    08:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కోల్‌కతాలోని రాజర్‌హట్‌లోని బిస్వా బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం జరిగిన జీ20మొదటి 'గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్' సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించారు. బెంగాల్ రాష్ట్రం ప్రభుత్వం 12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించినట్లు చెప్పారు. జీడీపీని అనేక రేట్లను పెంచినట్లు వెల్లడించారు.

    రాష్ట్రంలో మతం, కులాలు, భాషా భేదాలు ఉన్నా అందరూ ఐక్యంగానే ఉన్నారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. రైతులు, ఎంఎస్‌ఎంఈలు, మహిళా సాధికారత వల్లే ఈ అభివృద్ధి జరిగినట్లు సీఎం చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు 'మీ ఇంటి వద్దే ప్రభుత్వం' (దువారే సర్కార్) కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

    మమత

    'దువారే సర్కార్'కు జాతీయ అవార్డు

    బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న దువారే సర్కార్ కార్యక్రమం జాతీయ అవార్డును సైతం గెల్చుకున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.

    ప్రజల మధ్య విభజనను తాను నమ్మనని చెప్పారు మమత. ప్రపంచమంతా తన మాతృభూమి అని ఆమె అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ జాతీయంగా మందగించినప్పటికీ.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో నాలుగు శాతం వృద్ధిని సాధించగలిగిందని ఆమె పేర్కొన్నారు.

    మూడు రోజుల పాటు బెంగాల్ జీ20 'గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్' సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు విదేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మమతా బెనర్జీ
    పశ్చిమ బెంగాల్

    తాజా

    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు

    మమతా బెనర్జీ

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ కోవిడ్
    టీచర్స్ స్కామ్: 59 మంది ఉపాధ్యాయులను తొలగించాలని హైకోర్టు ఆదేశం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025