NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Revanth Reddy: తెలంగాణ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్‌ కేంద్రానికి విజ్ఞప్తి
    తదుపరి వార్తా కథనం
    Revanth Reddy: తెలంగాణ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్‌ కేంద్రానికి విజ్ఞప్తి
    తెలంగాణ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్‌ కేంద్రానికి విజ్ఞప్తి

    Revanth Reddy: తెలంగాణ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్‌ కేంద్రానికి విజ్ఞప్తి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 12, 2024
    05:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో వర్షాలు, వరదలు రాష్ట్రానికి భారీగా నష్టం మిగిల్చాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సుమారు రూ.5,438 కోట్ల నష్టంపై నివేదిక అందించారు.

    వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. నష్టపరిహారం అందించాలన్న అభ్యర్థనతో రేవంత్ రెడ్డి ఈ నెల 2న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

    ఈ పరిస్థితులపై వివరాలు చెప్పేందుకు ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరారు.

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో, సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం హుటాహుటిన దిల్లీకి పయనమయ్యారు.

    Details

    కేంద్ర మంత్రులను కలవనున్న రేవంత్ రెడ్డి

    అమిత్ షాతో జరిగే ఈ సమావేశంలో, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వర్షాలు, వరదలతో మిగిలిన అపార నష్టాన్ని వివరించనున్నారు.

    రోడ్లు, పంటలు, వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యలను ఆయన అమిత్ షాకు వివరిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

    వర్షాల కారణంగా మృతిచెందిన పశువులు, పక్షులు, కోళ్లకు కూడా పరిహారం చెల్లించాలని, రాష్ట్రంలో భారీ నష్టం నేపథ్యంలో, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి ఆర్థిక సాయం అందించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారని సమాచారం.

    ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోతే, సీఎం రేవంత్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ నేతలను కూడా కలవనున్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    రేవంత్ రెడ్డి

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    తెలంగాణ

    Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. సాయం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ నరేంద్ర మోదీ
    Telangana: ఎడతెరపి లేని వర్షాలు.. 15 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు భారీ వర్షాలు
    Revanth Reddy: తెలంగాణలో వరదలు.. సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి
    Revanth Reddy: జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి రేవంత్ రెడ్డి

    రేవంత్ రెడ్డి

    Revanth Reddy: ఫోన్ల టాపింగ్ కేసు విచారణ కొనసాగుతుంది : రేవంత్  భారతదేశం
    Revanth Reddy : ఉచిత బస్ ట్రావెల్ స్కీమ్‌పై రేవంత్‌ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌  తెలంగాణ
    Revanth Reddy : రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యిన రేవంత్‌రెడ్డి భారతదేశం
    Days After Oath: చంద్రబాబు, రేవంత్ పెండింగ్ సమస్యలపై కీలక భేటీ  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025