NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cm Revanth Reddy : అసెంబ్లీ సాక్షిగా జ్యుడీషియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఈ 3 అంశాలపైనేనట
    తదుపరి వార్తా కథనం
    Cm Revanth Reddy : అసెంబ్లీ సాక్షిగా జ్యుడీషియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఈ 3 అంశాలపైనేనట
    అసెంబ్లీ సాక్షిగా జ్యుడీషియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

    Cm Revanth Reddy : అసెంబ్లీ సాక్షిగా జ్యుడీషియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఈ 3 అంశాలపైనేనట

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 21, 2023
    02:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ విద్యుత్ రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ మేరకు చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది.

    తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. తప్పులు జరిగినట్టు మీరు భావిస్తే జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలని సవాల్ విసిరారు.

    దీంతో జ్యుడీషియల్ విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన సీఎం రేవంత్, అసెంబ్లీ వేదికగా మూడు అంశాలపై ఎంక్వైరీ వేయిస్తామన్నారు,

    విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న అవకతవకలు ప్రజలకు తెలియాలనే శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు.

    భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్, మీ ఉద్దేశాలు ఏమిటో విచారణలో వెల్లడవుతాయన్నారు.

    details

    రెండో భద్రాద్రి, మూడోది యాదాద్రి పవర్ ప్రాజెక్ట్

    ఇదే సమయంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విచారణను మొదటిఅంశంగా ఆదేశిస్తున్నామన్నారు.

    కేంద్రం తక్కువ ధరకే నాణ్యత విద్యుత్ అందిస్తున్నా అధిక ధరకు ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ ఒప్పందం చేసుకున్నారన్నారు.

    ఇక రెండో అంశంగా 1,080 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, మూడో అంశంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై కూడా విచారణకు ఆదేశిస్తున్నామన్నారు.

    కరెంట్ సెంటిమెంట్ అంశాన్ని గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుందని రేవంత్ మండిపడ్డారు.

    ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలుపై గతంలో ప్రశ్నించిన తమను మార్షల్స్ చేత సభ బయటకు గెంటించారని గుర్తుచేశారు.

    ఉద్యమ సమయంలో పని చేసిన విద్యుత్ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారన్నారు. 24గంటల విద్యుత్ పంపిణీ చేశామంటున్నారని, అవన్నీ అబద్ధాలేనన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    రేవంత్ రెడ్డి

    రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు భారీ ప్రమాదం; కార్లు ధ్వంసం కాంగ్రెస్
    ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ వరాల జల్లు.. 12అంశాలతో డిక్లరేషన్‌ కాంగ్రెస్
    Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే  బీఆర్ఎస్
    Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025