Loading...
Rajasthan: రాజస్థాన్‌లో స్కూల్ తనిఖీకి వెళ్లిన కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై దాడి

Rajasthan: రాజస్థాన్‌లో స్కూల్ తనిఖీకి వెళ్లిన కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలపై గ్రామస్థులు దాడి చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రంకా తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రభుత్వానికి 48 గంటల గడువు విధించారు.

వివరాలు 

స్కూల్‌ పరిస్థితిపై పరిశీలన

సంగనేర్ పరిధిలోని రాంపురా-కన్వర్‌పురా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు సీజేపీ బృందం వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అశుతోష్ రంకా తెలిపారు.

ఆ పాఠశాల కొన్నేళ్లుగా గేదెల కొట్టంలోనే కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.

గత ఏడాది కూడా తమ బృందం అక్కడికి వెళ్లిందని, అయితే అప్పటి పరిస్థితితో పోలిస్తే ఇప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదని పేర్కొన్నారు.

వివరాలు 

వాహనాల అద్దాలు, ఫోన్లు ధ్వంసం

తమ బృందం అక్కడికి చేరుకునే సమయానికి కొంతమంది బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తులు అక్కడే ఉన్నారని రంకా ఆరోపించారు.

ఆ తర్వాత ఒక్కసారిగా తమపై దాడి జరిగిందని చెప్పారు. దాడిలో తమ వాహనాల అద్దాలు పగలగొట్టారని, మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఆరోపించారు.

ఓ మహిళా కార్యకర్తపై కూడా దాడి జరిగినట్లు తెలిపారు. తన చొక్కాను సైతం చించివేశారని పేర్కొన్నారు.

ఓ కార్యకర్త చేయి విరిగిందని, తమపై రాళ్లు కూడా విసిరారని రంకా ఆరోపించారు.

మహిళా కార్యకర్తలను కూడా రాళ్లతో లక్ష్యంగా చేసుకున్నారని, వారి మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

పోలీసులపై తీవ్ర ఆరోపణలు

ఘటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ వారు అక్కడ ప్రేక్షక పాత్ర పోషించారని రంకా ఆరోపించారు.

తమ కార్యకర్తలపై జరిగిన దాడి ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

48 గంటల డెడ్‌లైన్

పాఠశాలల తనిఖీలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే తొలగించాలని కూడా రంకా డిమాండ్ చేశారు.

48 గంటల్లోగా దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈసారి తమ పోరాటం కేవలం ప్రభుత్వ పాఠశాలల సమస్యలకే పరిమితం కాదని, విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ రాజీనామా కోసం కూడా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

గ్రామస్థుల అభ్యంతరంతో ఉద్రిక్తత

మరోవైపు, సీజేపీ బృందం పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో స్థానిక గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఇరువర్గాల మధ్య మొదట వాగ్వాదం చోటుచేసుకుని, ఆ తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి దాడికి పాల్పడిన వారి వివరాలు, పోలీసులు తీసుకున్న తదుపరి చర్యలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాక్రోచ్ పార్టీ బృందంపై దాడి

ADVERTISEMENT