Page Loader
Coconut price: కొబ్బరి ధర మరింత పెరుగుతుందని అటకలపై నిల్వ చేస్తున్న రైతులు
కొబ్బరి ధర మరింత పెరుగుతుందని అటకలపై నిల్వ చేస్తున్న రైతులు

Coconut price: కొబ్బరి ధర మరింత పెరుగుతుందని అటకలపై నిల్వ చేస్తున్న రైతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

కోనసీమలో గత మూడు నెలలుగా పచ్చికొబ్బరికాయల ధరలు పెరుగుతుండటం, అలాగే కాయలు శుభ్రపడి కురిడీగా మారిన వాటికి మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతోందన్న అంశాల నేపథ్యంలో రైతులు, వ్యాపారులు పెద్ద మొత్తంలో కొబ్బరికాయలను సేకరిస్తున్నారు. రానున్న పండగ కాలానికి మంచి ధర దక్కుతుందన్న అంచనాతో వీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా పచ్చికాయలను ఇంటి అటకలపై పోసి, ఆరు నెలలపాటు ఉంచితే వాటిలో నీరు పూర్తిగా ఇంకిపోయి కురిడీగా మారతాయి.. తద్వారా అవి కురిడీగా మారి మార్కెట్‌ విలువ పెరుగుతుంది. వచ్చే రోజుల్లో ఇవి మరింత మంచి ధరలు సాధిస్తాయన్న ఆశతో పండ్లను పెద్దఎత్తున అటకలపై నిల్వ చేస్తున్నారు.

వివరాలు 

పచ్చికాయలకు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ధర

ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో రైతులు ఈ ప్రక్రియను చేపట్టి పచ్చికాయలను కురిడీగా మార్చే పని చేస్తున్నారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే వ్యాపారులు పచ్చికాయలకు ఆకర్షణీయమైన ధరలు ఇచ్చి కొనుగోలు చేయడంతో చాలా మంది అప్పుడే అమ్మేశారు. ప్రస్తుతం కూడా మార్కెట్‌లో పచ్చికాయలకు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ధర లభిస్తున్నప్పటికీ, చాలా మంది వాటిని అమ్మకుండా నిల్వ చేయడం గమనార్హం అని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

కొబ్బరి క్వింటాలుకు రూ.24,000

కోనసీమ కొబ్బరి మార్కెట్‌లో బుధవారం నాటి ధరల్ని పరిశీలిస్తే.. తాజా కొబ్బరి క్వింటాలుకు రూ.24,000 పలుకుతోంది,ఇది ఇప్పటివరకు ఎప్పుడూ నమోదు కాని రికార్డు ధర. కురిడీలలో గండేరా రకం వెయ్యింటికి రూ.29,000, గటగట రకం రూ.26,000గా ఉంది. అదే విధంగా, తాజా కాయలతో తయారయ్యే కురిడీ గండేరా రకం రూ.28,000, గటగట రకం రూ.25,000 పలుకుతున్నాయి. ఇక పచ్చికాయల ధర వెయ్యింటికి రూ.19,000 నుండి రూ.21,000 మధ్య ఉండగా, ఇవన్నీ రికార్డు స్థాయి ధరలుగా వ్యాపారవేత్తలు పేర్కొంటున్నారు.