NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pralhad Joshi:'పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్
    తదుపరి వార్తా కథనం
    Pralhad Joshi:'పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్
    పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్

    Pralhad Joshi:'పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 29, 2024
    03:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తీవ్రంగా స్పందించారు.

    స్మారకం నిర్మించే ప్రాంతం కాకుండా నిగంబోధ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు రాజకీయ అంశంగా మలచడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు.

    'గాంధీ కుటుంబం' గాంధీయేతర కాంగ్రెస్‌ నేతలకు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం విచారకరమని అన్నారు.

    మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణించినప్పుడు ఆయనకు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయకపోవడం కాంగ్రెస్‌ పార్టీ నైజాన్ని ప్రతిబింబించిందన్నారు.

    ఇది ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుందని జోషి గుర్తుచేశారు.

    Details

    అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలోనే స్మారక స్థలం నిర్మించాలి

    పీవీ నరసింహరావు, సర్దార్ వల్లభాయ్ పటేల్‌లకు కూడా కాంగ్రెస్ తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన విమర్శించారు.

    ఈ వ్యవహారంపై గాంధీ కుటుంబం ఆత్మపరిశీలన చేయాలని సూచించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో తమకు సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు ఉన్నా ఆయన అత్యంత గౌరవనీయమైన వ్యక్తి అని చెప్పారు.

    ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మన్మోహన్ సింగ్‌ అంత్యక్రియల ఏర్పాటుకు పూర్తి బాధ్యత తీసుకున్నారు.

    ఆయనకు తగిన గౌరవం ఇవ్వడంలో ఏ లోటూ జరగలేదని కేంద్రమంత్రి స్పష్టంచేశారు.

    కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ, మన్మోహన్ సింగ్‌ అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలోనే స్మారక స్థలం నిర్మించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

    Details

    ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా సంచలన వ్యాఖ్యలు

    ఇటీవల ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా కీలక వ్యాఖ్యలు చేశారు.

    తన తండ్రి మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీ తనను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. రాష్ట్రపతులకు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం లేదని చెప్పారు.

    అయితే తన తండ్రి డైరీ చదివిన తర్వాత, రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ మరణం సందర్భంగా సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారన్న నిజాన్ని తెలుసుకున్నట్లు వెల్లడించారు.

    ఈ వ్యాఖ్యలు కేంద్ర-కాంగ్రెస్‌ మధ్య వివాదాన్ని మరింత పెంచుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    బీజేపీ
    ఇండియా
    మన్మోహన్ సింగ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్

    Congress: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. బీజేపీ నేతలు, మిత్రపక్షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు దిల్లీ
    Haryana polls: వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు రూ.6వేల పెన్షన్.. ఏడు గ్యారంటీలతో హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో  హర్యానా
    Mallikarjuna Kharge: ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అస్వస్థత.. వీడియో వైరల్  మల్లికార్జున ఖర్గే
    Congress: వేదికపైనే కాంగ్రెస్ మహిళా నేతపై వేధింపులు.. పార్టీపై తీవ్ర విమర్శలు (వీడియో) హర్యానా

    బీజేపీ

    BJP: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు 15 మంది అభ్యర్థులతో కూడిన కొత్త జాబితా విడుదల చేసిన బీజేపీ  జమ్ముకశ్మీర్
    Kangana Ranaut: కంగనా రనౌత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ  భారతదేశం
    Champai Soren: తనపై నిఘా ఉంచడంతోనే బీజేపీలో చేరా.. చంపాయ్ సోరెన్ జార్ఖండ్
    Maharashtra: మద్యం మత్తులో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కొడుకు భీభత్సం.. పలు వాహనాలను ఢీకొట్టి పరార్! మహారాష్ట్ర

    ఇండియా

    Heavy Snow : హిమాచల్‌లో మంచు దుప్పటి కప్పేసింది.. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు హిమాచల్ ప్రదేశ్
    Warangal Airport: భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వరంగల్ రైతులు.. ఎయిర్ పోర్టు పునరుద్ధరణలో సవాల్ వరంగల్ తూర్పు
    Fetus brain 3d images: పిండంలో మెదడు.. 3డీ హై రిజల్యూషన్ చిత్రాలతో విప్లవాత్మక పరిశోధన మెదడు
    Year Ender 2024: ఇండియా నుంచి గ్రీక్ వరకూ.. అత్యుత్తమ వంటకాలు అందించిన టాప్ దేశాలివే! సంవత్సరం ముగింపు 2024

    మన్మోహన్ సింగ్

    భారత్ సరైన పనే చేసింది: రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత కేంద్రం వైఖరికి మాజీ ప్రధాని మద్దతు   జీ20 సదస్సు
    Manmohasingh: మన్మోహన్ సింగ్ కు ముగిసిన రాజ్యసభ పదవీకాలం...హీరోగా మిగిలిపోయారన్న మల్లికార్జునఖర్గే మల్లికార్జున ఖర్గే
    Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Manohansingh On Modi: ప్రసంగాలతో ప్రధాని గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ: మన్మోహన్ సింగ్   నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025