Loading...
Cotton Procurement: ఈ-పంటలో నమోదైన రైతుల నుంచే పత్తి కొనుగోలు.. సీసీఐకి ప్రభుత్వం ఆదేశాలు
ఈ-పంటలో నమోదైన రైతుల నుంచే పత్తి కొనుగోలు.. సీసీఐకి ప్రభుత్వం ఆదేశాలు

Cotton Procurement: ఈ-పంటలో నమోదైన రైతుల నుంచే పత్తి కొనుగోలు.. సీసీఐకి ప్రభుత్వం ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ)ని జారీ చేసింది. భారత పత్తి సంస్థ (సీసీఐ) గుర్తించిన కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్‌ మిల్లుల్లోనే పత్తిని సేకరించాలని ఆదేశించింది. సీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే కాటన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మాడ్యూల్‌ ద్వారా కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ-పంట ఆధారంగానే రైతుల గుర్తింపు వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న ఈ-పంట వివరాలను ఆధారంగా చేసుకుని పత్తి రైతులను గుర్తించాలని ప్రభుత్వం సూచించింది. ఈ-పంటలో నమోదైన రైతుల నుంచే పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తద్వారా కొనుగోలు ప్రక్రియలో రైతుల వివరాల పరిశీలనను సక్రమంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.

వివరాలు 

కపాస్‌ కిసాన్‌ యాప్‌తో స్లాట్‌ బుకింగ్

పత్తి విక్రయించేందుకు రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని స్లాట్‌ బుక్‌ చేసుకునేలా వ్యవసాయ సహాయకులు సహకరించాలని ఆదేశించింది.

యాప్‌ వినియోగం, స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియపై రైతులకు అవసరమైన అవగాహన కల్పించాలని సూచించింది.

కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకొచ్చే సమయంలో గోనె సంచుల్లో కాకుండా విడిగా తీసుకురావాలని రైతులకు తెలియజేయాలని పేర్కొంది.

వివరాలు 

గతేడాది సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు

గత ఏడాది పత్తి సేకరణ సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈసారి కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం సీసీఐని ఆదేశించింది.

ముఖ్యంగా పత్తి సేకరణ, స్లాట్‌ బుకింగ్‌, షెడ్యూలింగ్‌ అంశాల్లో గతంలో తలెత్తిన సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఈ మేరకు వ్యవసాయశాఖ ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సీసీఐ గుర్తించిన కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి సేకరణ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ADVERTISEMENT