English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kaleshwaram Project : మూడు బ్యారేజీలకు తొమ్మిది రకాల పరీక్షలకు ఏడాది సమయం: సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kaleshwaram Project : మూడు బ్యారేజీలకు తొమ్మిది రకాల పరీక్షలకు ఏడాది సమయం: సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌
    మూడు బ్యారేజీలకు తొమ్మిది రకాల పరీక్షలకు ఏడాది సమయం: సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌

    Kaleshwaram Project : మూడు బ్యారేజీలకు తొమ్మిది రకాల పరీక్షలకు ఏడాది సమయం: సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 29, 2025
    02:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నిర్వహించాల్సిన పరీక్షల కోసం సుమారు సంవత్సరం సమయం అవసరమవుతుందని పుణెలోని సెంటర్‌ ఫర్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌)వెల్లడించింది.

    ప్రతి పరీక్ష పూర్తవడానికి కనీసం 12 నెలల నుంచి గరిష్టంగా 18 నెలల వరకు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

    ఈ పరీక్షల విధానం,వాటికి పట్టే సమయం,వ్యయ వివరాలను నీటిపారుదల శాఖలోని ఓ అండ్ ఎం విభాగానికి ఈ సంస్థ అందించింది.

    ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక ఆధారంగా చేపట్టాల్సిన పరిశోధనలు,వాటి వ్యయాల సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు ఆ శాఖ సూచించింది.

    సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ ఎన్డీఎస్‌ఏ నివేదికను సవివరంగా పరిశీలించి,మొత్తంగా తొమ్మిదిరకాల పరీక్షలు అవసరమని సూచించింది.

    వివరాలు 

    ఈ పరీక్షలలో ముఖ్యంగా ..

    కాంక్రీట్‌ నిర్మాణ స్థితిని అంచనా వేయడం, దాని బలాన్ని పరిశీలించడం,మెటల్‌ గేట్ల మందాన్ని కొలవడం,నీటి చొరబడటాన్ని తెలుసుకునే గంగా జియోటెక్నికల్‌ అధ్యయనం,రెండు పియర్స్‌ మధ్య ఉన్న బే ప్రాంతంలో త్రీడీ స్ట్రెస్‌ విశ్లేషణ,బ్యారేజీ బలాన్ని అంచనా వేయడం, పారలెల్‌ సీస్మిక్‌ పరీక్ష,రాఫ్ట్‌ క్రింద ఏర్పడిన గుంతలను అంచనా వేసేందుకు జియోఫిజికల్‌ పరిశోధనలు, సీపేజీ ఆరంభమైన ప్రాంతాన్ని గుర్తించడం వంటి అంశాలు ఉన్నాయి.

    ఈ మూడు బ్యారేజీలపై పైపెరిగిన అన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

    అందులో మూడు పరీక్షలు మూడు నెలల్లో పూర్తవుతాయని, రెండు పరీక్షలకు ఆరు నెలలు పట్టవచ్చని, మిగిలిన వాటికి 12 నెలల సమయం పడుతుందని, ప్రత్యేకంగా పారలెల్‌ సీస్మిక్‌ పరీక్షకు 12 నుండి 18 నెలల సమయం అవసరమని వివరించింది.

    మీరు
    25%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    ఐదు వైఫల్యాలకు మేము బాధ్యులు కాదని ఎల్‌అండ్‌టీ వివరణ 

    ఈ పరిశోధనల కోసం అంచనా వేసిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాతే సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ తన పనిని ప్రారంభించనుంది.

    మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడిన లోపాలకు గల ఆరు ప్రధాన కారణాలను ఎన్డీఎస్‌ఏ తన నివేదికలో పేర్కొనగా, అందులో ఐదు అంశాలకు తాము బాధ్యులు కాదని గుత్తేదారు సంస్థ ఎల్‌అండ్‌టీ - పీఈఎస్‌ ప్రకటించింది.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    ఈ కారణాల్లో.. 

    డిజైన్లకు అవసరమైనంతగా జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ జరగకపోవడం,భూభౌతిక పరిస్థితులను సరైన రీతిలో అంచనా వేయలేకపోవడం,టీఎస్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ చేసిన మోడల్‌ అధ్యయనాల్లో లోపాలు ఉండటం,హైడ్రాలిక్‌ స్ట్రక్చర్‌ డిజైన్స్‌, ముఖ్యంగా ఎనర్జీ డిసిపేషన్‌పై తగిన అంచనా లేకపోవడం,ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లో లోపాలు,అలాగే డ్యాం సేఫ్టీ యాక్ట్‌-2021కు అనుగుణంగా నిర్వహణ జరగకపోవడం వంటి అంశాలు ఉన్నాయి.

    మీరు
    75%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    ఎన్డీఎస్‌ఏ అడిగిన ప్రశ్నలకు సంబంధిత నివేదికలు సమర్పించాం: ఎల్‌అండ్‌టీ

    ఇవన్నింటికీ తమకు సంబంధం లేదని ఎల్‌అండ్‌టీ స్పష్టం చేసింది.

    అయితే, క్వాలిటీ కంట్రోల్‌ లోపమై ఎన్డీఎస్‌ఏ అడిగిన ప్రశ్నలకు తాము సంబంధిత నివేదికలు సమర్పించామని సంస్థ పేర్కొంది.

    ఇవి అందించిన తరువాతే ఎన్డీఎస్‌ఏ తుది నివేదికను విడుదల చేసినట్లు తెలియజేసింది.

    మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రారంభంలో గ్రౌటింగ్‌ చేయడం వల్ల భూమి వాస్తవ పరిస్థితులు, నిర్మాణ బలాన్ని అంచనా వేయడం సాధ్యపడలేదని, ప్లింత్‌ స్లాబులపై గ్రౌటింగ్‌ వల్ల సీకెంట్‌ పైల్స్‌ పరిస్థితి మారిపోయిందని, తద్వారా కట్‌ఆఫ్‌ల వాస్తవ స్థితిని గుర్తించడం కష్టమైందని నివేదికలో పేర్కొనబడింది.

    అయితే బ్యారేజీ నిర్వహణ సమయంలో ఏర్పడిన లోపాలపై ఇంజినీర్లు రాసిన లేఖలకు ఎలాంటి స్పందన ఇవ్వలేదని నీటిపారుదల శాఖ ఆరోపించగా, దీనిపై ఎల్‌అండ్‌టీ మాత్రం స్పందించలేదు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాళేశ్వరం ప్రాజెక్టు

    తాజా

    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా
    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు
    USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు ..  అమెరికా
    Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌ స్టాక్ మార్కెట్

    కాళేశ్వరం ప్రాజెక్టు

    Annaram Barrage: అన్నారం బ్యారేజీలో లీకేజీ.. భయాందోళనలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలు అన్నారం బ్యారేజీ
    Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీపై డ్యాం సేప్టీ సంచలన నివేదిక.. మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనట కేంద్ర ప్రభుత్వం
    Uttam Kumar Reddy: ఎవరినీ వదిలిపెట్టం: కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్ల కుంగిపోడవంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం  ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    Medigadda visit: 29న ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన  మేడిగడ్డ బ్యారేజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025