NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌ 
    తదుపరి వార్తా కథనం
    CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌ 
    డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌

    CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌ 

    వ్రాసిన వారు Stalin
    Oct 16, 2023
    02:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డిసెంబర్‌లో తన నివాసాన్ని విశాఖపట్నంకు మారుస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తెలిపారు.

    మధురవాడలోని ఐటీ సెజ్‌లో ఇన్ఫోసిస్ బిజినెస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

    ముఖ్యమంత్రి కార్యాలయానికి అనువైన స్థలం కోసం అన్వేషణ జరుగుతోందని, సీఎంఓ ఏర్పాటు చేసిన తర్వాత తాను వైజాగ్‌కు షిఫ్ట్ అవుతానని చెప్పారు.

    డిసెంబర్‌ కల్లా తాను ఇక్కడికి వచ్చి, వైజాగ్ నుంచే పాలన సాగిస్తానన్నారు.

    మరిన్ని ఐటీ సంస్థలు వైజాగ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నందున హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఇతర నగరాలతో సమానంగా విశాఖపట్నం అభివృద్ధి చెందే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

    సీఎం

    వచ్చే ఏడాది అదానీ డేటా సెంటర్ ప్రారంభం 

    విశాఖపట్నం ఐటీ, పారిశ్రామిక వృద్ధిలో ఇన్ఫోసిస్ కీలక పాత్ర పోషిస్తుదని సీఎం జగన్ అన్నారు.

    వచ్చే ఏడాది అదానీ డేటా సెంటర్ ప్రారంభం విశాఖపట్నం ఐటీ వ్యాపారం మొత్తం ల్యాండ్‌స్కేప్‌ను మారుస్తుందన్నారు.

    విశాఖపట్నంలో మానవ వనరుల కొరత లేదని, నగరంలో ఎనిమిది యూనివర్సిటీలు, 14 ఇంజినీరింగ్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, ఏటా 13 వేల మంది ఇంజనీర్లను తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

    అదనంగా నగరంలో ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీ, మారిటైమ్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయన్నారు.

    కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సీనియర్ డైరెక్టర్ నిరంజన్ రాయ్, మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, విడదల రజనీ, మేయర్ జి హరి వెంకట కుమారి, రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్
    వైజాగ్
    విశాఖపట్టణం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్
    వైఎస్ కుటుంబం చీలిపోయిందా? వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య పోరు తప్పదా?  కడప
    ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్  విజయనగరం

    ఆంధ్రప్రదేశ్

    చంద్రబాబుకు ఎదురుదెబ్బ.. ఏసీబీ కోర్టులో హౌస్‌ కస్టడి పిటిషన్‌ కొట్టివేత చంద్రబాబు నాయుడు
    చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన  ఏపీ హైకోర్టు  చంద్రబాబు నాయుడు
    ముంబై: రన్‌వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు  ముంబై
    స్కిల్ డెవలప్‌మెంట్ పై మాజీ ఎండీ కీలక వ్యాఖ్యలు..ఎటువంటి స్కామ్ జరగలేదని స్పష్టం భారతదేశం

    వైజాగ్

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ
    ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్

    విశాఖపట్టణం

    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025