దిల్లీ 24 గంటల్లోనే 4హత్యలు; లెఫ్టినెంట్ గవర్నర్కు కేజ్రీవాల్ ఘాటైన లేఖ
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాకు లేఖ రాశారు. దిల్లీలో తీవ్రమైన నేరాలు ఆందోళనకరంగా మారినట్లు చెప్పారు. తక్షణమే దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. మహిళలపై నేరాల నివారణకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ), లెఫ్టినెంట్ గవర్నర్పై ఆయన విరుచుకుపడ్డారు. గత 24 గంటల్లో దిల్లీ నాలుగు హత్యలు జరిగాయని ఆ లేఖలో పేర్కొన్నారు. తమ జీవితాల భద్రత కోసం, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి అత్యవసర చర్యలను ప్రారంభించాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం, భారతదేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో మహిళలపై జరిగిన మొత్తం నేరాల్లో 32.20 శాతం దిల్లీలో జరిగాయి.