Bansuri Swaraj: బీజేపీ నేత బన్సూరి స్వరాజ్పై పరువు నష్టం కేసు.. కొట్టేసిన ఢిల్లీ కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
క్రిమినల్ పరువు నష్టం కేసులో దిల్లీ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్కి ఊరట లభించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఆమెపై దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ను దిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది.
ఈ అంశాన్ని విచారణలోకి తీసుకోవడానికి నిరాకరించిన అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నేహా మిత్తల్, పిటిషన్ను తిరస్కరించారు.
2003 అక్టోబర్ 5న జరిగిన ఓ టీవీ ఇంటర్వ్యూలో బాన్సురీ స్వరాజ్ తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని,ఆ ఇంటర్వ్యూను లక్షలాది మంది వీక్షించారని సత్యేందర్ జైన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
వివరాలు
సరైన ఆధారాలు లేవు..
తన నివాసం నుంచి రూ.3 కోట్లు నగదు, 1.8 కిలోల బంగారం, 133 బంగారు నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు బాన్సురీ స్వరాజ్ తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
తన ప్రతిష్టను దెబ్బతీసేలా, రాజకీయ ప్రయోజనం కోసం అవినీతిపరుడు, మోసగాడు అంటూ ఆమె తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేశారని జైన్ పిటిషన్లో పేర్కొన్నారు.
తాజాగా ఈ కేసును విచారించిన దిల్లీ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్.. సరైన ఆధారాలులేవన్న కారణంగా పరువు నష్టం పిటిషన్ను కొట్టివేశారు.