English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్యం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్యం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట
    ఈడీ దూకుడుతో అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ

    దిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్యం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 08, 2023
    06:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ లిక్కర్ కుంభకోణంలో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్రూవర్ గా మారడం సంచలనంగా మారింది.

    దిల్లీ లిక్కర్ స్కాంలో ఎంపీ పేరూ ఉండటంతో గతంలో పలుమార్లు నోటీసులు అందుకున్నారు.

    అయినప్పటికీ విచారణకు మాత్రం గైర్హజరయ్యారు. ఈ మేరకు ఆయన కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవలే ఆయన బెయిల్ పొందడం, అనంతరం అప్రూవర్ పిటిషన్ వేయడం, కోర్టు అంగీకరించడం చకాచకా జరిగిపోయాయి.

    తాజాగా మాగుంట సైతం అప్రూవర్ పిటిషన్ వేయడం దిల్లీ లిక్కర్ స్కాంలో దుమారం రేపనుంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు ఆడిటర్ గా పనిచేసిన బుచ్చిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించారు.

    DETAILS

    బాలాజీ గ్రూప్ లిక్కర్ తయారీ, పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు

    మరోవైపు మాగుంట వెల్లడించిన వివరాలతో ఈడీ దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి దిల్లీకి నగదు తరలింపుపై కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

    బాలాజీ గ్రూప్ యజమాని మాగుంట రాఘవ దిల్లీలో లిక్కర్ వ్యాపారం నిర్వహిస్తుంటారు. గత 70 ఏళ్లుగా మాగుంట కుటుంబం లిక్కర్ వ్యాపారంపైనే ఆధారపడింది. దేశంలో చాలా చోట్ల మాగుంట ఫ్యామిలీకి లిక్కర్ దుకాణాలున్నాయి.

    ఏంజెల్ షాంపైన్ ఎల్ఎల్పీ, తమిళనాడు డిస్టిలరీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కంపెనీలు లిక్కర్ తయారీ, పంపిణీలో అవకతవకలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

    దిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో భాగంగా ఏ కంపెనీకి రెండు జోన్ల కంటే ఎక్కువ కేటాయించకూడదు. కానీ ఇందుకు విరుద్ధంగా వ్యాపారం చేసినందునే దిల్లీలో మద్యం కుంభకోణం జరిగినట్లు ఈడీ వాదిస్తోంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    కుంభకోణం

    తాజా

    Father's Day 2025: ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకి 'హీరో'లా ఇలా స్పేషల్ గిఫ్ట్ ఇవ్వండి! ప్రేరణ
    UPI Payments: రూ.3వేలు దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం  యూపీఐ
    Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరిసిన మంధాన.. రెండో స్థానంలో భారత స్టార్ బ్యాటర్ ఐసీసీ
    Motivation: 'రిజెక్షన్' బాధ పెడుతోందా? మీలో ధైర్యాన్ని నింపే ఐదు మార్గాలివే! ప్రేరణ

    దిల్లీ

    రాహుల్ గాంధీ, ఖర్గేకు థ్యాంక్స్ చెప్పిన దిల్లీ సీఎం కేజ్రీవాల్  అరవింద్ కేజ్రీవాల్
    'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం దిల్లీ సర్వీసెస్ బిల్లు
    Terror Attack: స్వాతంత్య్ర దినోత్సవం వేళ దిల్లీపై దాడికి ఉగ్రవాదుల ప్లాన్ స్వాతంత్య్ర దినోత్సవం
    సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారత్ విశ్వగురువు అవుతుందా?: కేజ్రీవాల్  అరవింద్ కేజ్రీవాల్

    కుంభకోణం

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ కుంభకోణం.. మేనేజర్లు సహా 10 మంది నిందితుల అరెస్ట్  బ్యాంక్
    భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు  జార్ఖండ్
    Minority Scholarship Scam: మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణం; సీబీఐ కేసు నమోదు  సీబీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025