NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / DGMO చర్చలకు బ్రేక్.. భారత్-పాక్ భేటీ అనూహ్యంగా వాయిదా!
    తదుపరి వార్తా కథనం
    DGMO చర్చలకు బ్రేక్.. భారత్-పాక్ భేటీ అనూహ్యంగా వాయిదా!
    DGMO చర్చలకు బ్రేక్.. భారత్-పాక్ భేటీ అనూహ్యంగా వాయిదా

    DGMO చర్చలకు బ్రేక్.. భారత్-పాక్ భేటీ అనూహ్యంగా వాయిదా!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2025
    02:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం - పాకిస్థాన్ మధ్య ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన డీజీఎంఓ (DGMO) స్థాయి చర్చలు ఆకస్మికంగా వాయిదా పడ్డాయి.

    మే 10, 2025న ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరింత బలపరిచే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, అనూహ్యంగా ఇవి సాయంత్రానికి వాయిదా వేశారు.

    వాయిదా వెనుక కారణాలపై అధికారికంగా ఎలాంటి సమాచారం బయటపడలేదు. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ చర్చలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరగనున్నాయి.

    ఈ భేటీలో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొనబోతున్నారు.

    Details

    సింధూ జలాల ఒప్పందపై ఆసక్తి

    చర్చల్లో ప్రధానాంశాలు కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపు, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)కు సంబంధించి వివాదాల పరిష్కారం వంటి అంశాలపై దృష్టిసారించనున్నారు.

    ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న దౌత్యపరమైన కఠిన నిర్ణయాలు, అలాగే సింధూ జలాల ఒప్పందంపై భారత ప్రభుత్వం తీసుకోబోయే వైఖరిపై ప్రజల్లో విశేష ఆసక్తి నెలకొంది.

    ఈ చర్చల ఫలితాలపై సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కోరుకునే ప్రజలు ఎంతో ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    DGMO చర్చలకు బ్రేక్.. భారత్-పాక్ భేటీ అనూహ్యంగా వాయిదా! భారతదేశం
    Nani: ఇటుకతో కోట కట్టిన నాని.. నేచురల్ స్టార్ సక్సెస్ ప్రొఫైల్ ఇదే! నాని
    US- china trade deal: టారిఫ్‌ వార్‌కు తాత్కాలిక విరామం.. 90 రోజుల సమయం ఇచ్చిన అమెరికా, చైనా అమెరికా
    Kishan Reddy: తెలంగాణలో జాతీయ రహదారుల కోసం రూ.31 వేల కోట్లు కేటాయింపు తెలంగాణ

    భారతదేశం

    India-Pakistan: ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేత..?  భారతదేశం
    X Handle: భారత్‌లో పాక్‌ రక్షణ మంత్రికి షాక్‌.. ఖవాజా అసిఫ్ 'ఎక్స్‌' ఖాతా బ్లాక్‌ పాకిస్థాన్
    India-Pakistan: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్‌ ఆర్మీ కాల్పులు.. సమర్థంగా ఎదుర్కొంటున్న భారత్‌  భారతదేశం
    Cancellation of visa: ఇక్కడే ఓటేశాను.. నన్నెందుకు పంపిస్తున్నారు..? వీసా రద్దుతో పాక్‌ యువకుడి వేదన!  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025