NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు
    తదుపరి వార్తా కథనం
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు
    జోషిమఠ్‌లో 678 భవనాలకు పగుళ్లు

    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు

    వ్రాసిన వారు Stalin
    Jan 10, 2023
    04:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రకృతి ప్రకోపానికి కుంచించుకుపోతున్న ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ పట్టణంలో కూలిపోయే అవకాశం ఉన్న భవనాలను కూల్చివేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. రోజు రోజుకు పగుళ్లు వచ్చిన ఇళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇది విపత్తుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    జోషిమఠ్‌‌లో ఇప్పటి వరకు మొత్తం 678 ఇళ్లు పగుళ్లు ఏర్పడినట్లు అధికారులు చెప్పారు. 81 కుటుంబాలను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. నివాసానికి అనుకూలంగా లేని భవనాలకు రెడ్ మార్కులు పెట్టినట్లు చెప్పారు.

    జోషిమఠ్‌‌ వాసులు.. ఎముకలు కొరికే చలిలోనూ తమ ఇళ్లను వదలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు.

    జోషిమఠ్

    సహాయక చర్యలు ముమ్మరం

    సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ చెప్పారు. నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు.

    8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక ఎన్డీఆర్‌ఎఫ్, పీఏసీ అదనపు కంపెనీ సిబ్బందితో పాటు పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి కొన్ని ప్రాంతాలను సీజ్ చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు.

    మరోవైపు జోషిమఠ్ సమీపంలో నిర్మాణాలకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. ఇలాంటి నిర్మాణాల వల్లే.. జోషిమఠ్‌కు ఇలాంటి పరిస్థితి దాపురించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

    రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ జోషిమఠ్‌లోని విపత్తు పీడిత ప్రాంతాన్ని సందర్శించారు. బాధిత ప్రజలను ధైర్యం చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025