NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది?
    భారతదేశం

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది?

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది?
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 04, 2023, 10:51 am 1 నిమి చదవండి
    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది?
    మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన

    ఓ వ్యక్తి పీకల దాకా తాగి.. ఆ మత్తులో తొటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇది జరిగింది.. బస్సులో కాదు, ట్రైన్‌లో కాదు. అమెరికా నుంచి దిల్లీకి వస్తున్న ఢిల్లీ ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బుధవారం ఎయిర్ ఇండియా అధికారులు ధృవీకరించారు. నవంబర్ 26, 2022న న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగినట్లు ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. దీనిపై వెంటనే స్పందించిందిన ఎయిర్ ఇండియా.. అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించిందన్నారు.

    'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చాలని సిఫారసు

    మూత్ర విసర్జన ఘటనపై అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిందింతుడిని 'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చాలని ప్రభుత్వానికి ఎయిర్‌ఇండియా సిఫారసు చేసింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం‌ కోసం ఎదురుచూస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే.. బోయింగ్, ఎయిర్‌బస్ నుంచి కొన్ని బిలియన్ డాలర్లు వెచ్చించి.. 500 విమానాలను కొనుగోలు చేయడానికి ఎయిర్ ఇండియా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు టాటా గ్రూప్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ డీల్‌ జరుగుతున్నట్లు సమాచారం. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియాను మార్చడానికి రాబోయే ఐదేళ్లలో దేశీయ మార్కెట్‌లో కనీసం 30 శాతం వాటాను క్లెయిమ్ చేయడానికి సంస్థ కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    టాటా
    దిల్లీ

    తాజా

    కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రేసులో రసెల్..? ఐపీఎల్
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రభుత్వం
    పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఆప్ఘనిస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘాన్ విక్టరీ పాకిస్థాన్

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    వరుసగా 9వ సారి వడ్డీ రేట్లను పెంచిన అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటన
    క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయనున్న UBS బ్యాంక్ బ్యాంక్
    ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు టిక్ టాక్
    భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి బ్యాంక్

    టాటా

    ఎలక్ట్రిక్ వాహనాల కోసం షోరూమ్‌లను ప్రారంభించనున్న టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలు
    టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ రాజీనామా; కృతివాసన్‌కు బాధ్యతల అప్పగింత బిజినెస్
    MG కామెట్ EV vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం ఆటో మొబైల్

    దిల్లీ

    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు నరేంద్ర మోదీ
    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023