NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / George Soros: జార్జ్ సోరస్‌ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ లబ్ధిదారుల సంస్థల్లో ఈడీ సోదాలు  
    తదుపరి వార్తా కథనం
    George Soros: జార్జ్ సోరస్‌ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ లబ్ధిదారుల సంస్థల్లో ఈడీ సోదాలు  
    జార్జ్ సోరస్‌ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ లబ్ధిదారుల సంస్థల్లో ఈడీ సోదాలు

    George Soros: జార్జ్ సోరస్‌ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ లబ్ధిదారుల సంస్థల్లో ఈడీ సోదాలు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 18, 2025
    01:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ (George Soros) నిర్వహించే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ (OSF) లబ్ధిదారుల సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు.

    విదేశీ మారక నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో, బెంగళూరులో ఈ సోదాలు జరుగుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

    ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరిస్తోందని, అయితే ఈ నిధులను కొందరు లబ్ధిదారులు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ (FEMA) మార్గదర్శకాలను ఉల్లంఘించి ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో, ఈడీ అధికారులు సంబంధిత లబ్ధిదారుల సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

    అయితే, ఈ తనిఖీలపై ఇప్పటివరకు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

    వివరాలు 

     ప్రపంచంలోని ప్రముఖ కుబేరుల్లో జార్జ్ సోరోస్

    హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త, వితరణశీలి జార్జ్ సోరోస్ (వయస్సు 92) ప్రపంచంలోని ప్రముఖ కుబేరుల్లో ఒకరు.

    ఆయన స్థాపించిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ మానవ హక్కుల పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది.

    భారతదేశంలో ఈ సంస్థ 1999 నుండి తన కార్యలాపాలు కొనసాగిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    తాజా

    Jammu Kashmir: డ్రోన్‌లతో మళ్లీ విరుచుకపడ్డ పాక్.. పలు జిల్లాలో బ్లాక్ అవుట్ జమ్ముకశ్మీర్
    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్ భారతదేశం
    PM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష నరేంద్ర మోదీ
    Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు బాంబు బెదిరింపు

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    రాజస్థాన్‌: జల్ జీవన్ మిషన్ లింక్ మనీ లాండరింగ్ కేసులో 25 చోట్ల దాడులు రాజస్థాన్
    Delhi: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ భారతదేశం
    Neville Singham : అమెరికన్ మిలియనీర్ నెవిల్లే సింఘమ్‌కు షాక్.. సమన్లు జారీ చేసిన ఈడీ   భారతదేశం
    FEMA ఉల్లంఘనల కేసులో రూ.9,000కోట్లు చెల్లించాలని బైజూస్‌కు ఈడీ నోటుసులు  బైజూస్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025