NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mahua moitra: మహువా మోయిత్రాకి షాక్.. ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు 
    తదుపరి వార్తా కథనం
    Mahua moitra: మహువా మోయిత్రాకి షాక్.. ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు 
    మహువా మోయిత్రాకి షాక్.. ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు

    Mahua moitra: మహువా మోయిత్రాకి షాక్.. ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 03, 2024
    08:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మోయిత్రా 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కృష్ణానగర్ స్థానం నుండి ప్రచారంలో బిజీగా ఉన్నారు.

    మరోవైపు క్యాష్ ఫర్ క్వెరీ కేసులో మహువా కష్టాలు మరోసారి పెరిగాయి. సీబీఐ తర్వాత ఇప్పుడు ఈడీ కూడా ఆమెపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

    సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే మహువాపై ఈడీ కేసు నమోదు చేసింది. సమాచారం ప్రకారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మహువా మోయిత్రాపై ECIR ను నమోదు చేసింది.

    సాధారణ కేసులో ఎఫ్‌ఐఆర్ చేసిన విధంగానే, ఈడీ ఏదైనా సందర్భంలో ముందుగా ECIR నమోదు చేస్తుంది.

    ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంగా ఆమెతో పాటు వ్యాపారవేత్త దర్శన్ హిరానందానికి ఈడీ సమన్లు జారీచేసింది.

    మహువా మొయిత్రా

    సీబీఐ కేసు కూడా నమోదు చేసింది 

    గత నెలలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ మాజీ ఎంపీ మొయిత్రా నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.

    ఇక క్యాష్ ఫర్ క్వారీ వ్యవహారంలో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన మొయిత్రాకు తాజా లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరిగి టిక్కెట్ ఇచ్చింది.

    పశ్చిమబెంగాల్‌లోని కృష్ణనగర్ నుంచి ఆమె పోటీలో ఉన్నారు. ఈసారి ఆమెకు టికెట్ రాదని భావించారు కానీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం మొయిత్రాకు టికెట్ ఇచ్చారు.

    లోక్‌పాల్ సూచనల మేరకు ఆమెపై, హీరానందానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిందని, ఈ లోపు నివేదికను సమర్పించేందుకు ఏజెన్సీకి ఆరు నెలలు సమయం ఇచ్చినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

    లోక్‌సభ 

    అసలు కేసు ఏమిటి? 

    డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలతో ఆమె డిసెంబర్ 8, 2023న లోక్‌సభ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయింది.

    ఈ నిర్ణయాన్ని మాజీ ఎంపీ కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

    పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులపై దాడి చేసేందుకు హీరానందానీ నగదు, బహుమతుల కోసం లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని మహువా మొయిత్రాపై బీజేపీ లోక్‌సభ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించిన సంగతి తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహువా మోయిత్రా

    తాజా

    Defence Budget: ఆపరేషన్ సిందూర్.. కేంద్ర రక్షణ బడ్జెట్ రూ.50వేల కోట్ల పెంపు..! రక్షణ శాఖ మంత్రి
    IPL 2025 : 9 రోజుల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ హీట్.. టాప్-4 కోసం ఏడు జట్లు పోటీ! ఐపీఎల్
    India-Pak War : ఈనెల 18 వరకు భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు ఆర్మీ
    Trump: ట్రంప్‌ హత్య కు బెదిరింపులు.. ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌పై చర్యలు డొనాల్డ్ ట్రంప్

    మహువా మోయిత్రా

    మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు..అక్టోబర్ 26న ఎథిక్స్ ప్యానెల్ విచారణ  తృణమూల్ కాంగ్రెస్‌
    పీఎంఓ హీరానందని సంతకం చేయమని బలవంతం చేసింది: మహువా మోయిత్రా బీజేపీ
    మహువా మొయిత్రా కేసులో అనూహ్యం.. కేసు నుంచి తప్పుకున్న లాయర్, అక్టోబర్ 31న విచారణ  లోక్‌సభ
    Fresh attack on Mahua Moitra: మహువా మోయిత్రాపై బీజేపీ ఎంపీ తాజా దాడి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025