NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ECI: లోక్‌సభ ఎన్నికల డేటాసెట్'ను విడుదల చేసిన ఎన్నికల సంఘం
    తదుపరి వార్తా కథనం
    ECI: లోక్‌సభ ఎన్నికల డేటాసెట్'ను విడుదల చేసిన ఎన్నికల సంఘం
    లోక్‌సభ ఎన్నికల డేటాసెట్'ను విడుదల చేసిన ఎన్నికల సంఘం

    ECI: లోక్‌సభ ఎన్నికల డేటాసెట్'ను విడుదల చేసిన ఎన్నికల సంఘం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 26, 2024
    05:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ఎన్నికల సంఘం (ECI) గురువారం లోక్‌సభ ఎన్నికల డేటా సెట్‌ను విడుదల చేసింది.

    ఈ డేటా సెట్‌లో 42 గణాంక నివేదికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై 14 నివేదికలు ఉన్నాయి.

    100 గణాంకాలను విడుదల చేసి, అవి పారదర్శకత, పరిశోధన లక్ష్యంగా రూపొందించబడినట్లు తెలిపింది.

    ఈ డేటా సెట్‌ను విడుదల చేయడం ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెట్‌గా నిలుస్తుందని కూడా పేర్కొంది.

    వివరాలు 

    64.64 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు 

    ఈ డేటా సెట్‌లో పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల వివరణ,ఎన్నికల అధికారుల సంఖ్య, పోలింగ్ స్టేషన్ల సంఖ్య,రాష్ట్రాలు/పార్లమెంటరీ నియోజకవర్గం వారీగా ఓటింగ్ శాతం,పార్టీల వారీగా ఓట్ల వాటా,లింగ ఆధారిత ఓటింగ్ వివరాలు,రాష్ట్రాల వారీగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం,ప్రాంతీయ వైవిధ్యాలు,నియోజకవర్గాల డేటా,జాతీయ, ప్రాంతీయ/గుర్తింపు పొందని స్వతంత్ర పార్టీల పనితీరు, గెలిచిన అభ్యర్థుల విశ్లేషణ,నియోజకవర్గం వారీగా ఫలితాలు, ఇతర అంశాలు ఉన్నాయి.

    భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకారం, 64.64 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించి ప్రపంచ రికార్డును సృష్టించారు.

    2024లో నామినేషన్ల సంఖ్య 12,459 కాగా, 2019లో అది 11,692 ఉంది. 2024లో 8,360 మంది అభ్యర్థులు పోటీపడగా, 2019లో ఆ సంఖ్య 8,054గా ఉండింది.

    వివరాలు 

    2019 నుండి ట్రాన్స్‌జెండర్ల ఓటర్ల సంఖ్యలో 46.4 శాతం పెరుగుదల

    పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని నివేదిక పేర్కొంది.

    పురుష ఓటర్ల శాతం 65.55 కాగా, మహిళా ఓటర్ల శాతం 65.78కి చేరుకుంది. 2019లో 726 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేసారని, 2024లో ఆ సంఖ్య 800కి చేరుకుందని తెలిపింది.

    డేటా ప్రకారం, 2019 నుండి ట్రాన్స్‌జెండర్ల ఓటర్ల సంఖ్యలో 46.4 శాతం పెరుగుదల నమోదైనట్లు కనిపిస్తుంది.

    2019లో 61,67,482 మంది విభిన్న ప్రతిభావంతులు ఓటింగ్ కోసం నమోదు చేసుకోగా, 2024లో ఈ సంఖ్య 90 లక్షలకు చేరింది.

    2019లో 540 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరిగింది, అయితే 2024లో కేవలం 40 పోలింగ్ స్టేషన్లలో మాత్రమే రీపోలింగ్ జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఎన్నికల సంఘం

    Arunachal, Sikkim: కౌంటింగ్ తేదీల్లో మార్పు.. అరుణాచల్, సిక్కింలో జూన్ 2న ఓట్లు లెక్కింపు అరుణాచల్ ప్రదేశ్
    Election Commission of India:ఈసీ కీలక నిర్ణయం.. ఆరు రాష్ట్రాల్లో హోం సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ భారతదేశం
    Lok sabha Elections:లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల   భారతదేశం
    EC: కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025