Page Loader
VK Pandian: ఒడిశా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యిన వీకే పాండియన్‌
VK Pandian: ఒడిశా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యిన వీకే పాండియన్‌

VK Pandian: ఒడిశా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యిన వీకే పాండియన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2023
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్ వికె పాండియన్ సోమవారం అధికారికంగా ఆయన పార్టీ బిజూ జనతాదళ్ (బిజెడి)లో చేరారు. భువనేశ్వర్‌లోని నవీన్ నివాస్‌లో పట్నాయక్, ఇతర BJD నాయకుల సమక్షంలో పాండియన్ పార్టీలో చేరారు. పాండియన్ అక్టోబర్ 23న ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. పాండియన్ స్వచ్ఛంద పదవీ విరమణను కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత ఒడిశా ప్రభుత్వంలో 5T (ట్రాన్స్‌ఫార్మేషనల్ ఇనిషియేటివ్స్) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత, పాండియన్ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఒడిశా పొలిటికల్ సర్క్యూట్‌లో చర్చలు జరిగాయి.

Details 

వీకే పాండియన్‌ తమిళనాడు వాసి

వాటిని నిజం చేస్తూ.. తాజాగా ఆయన బీజేడీలో చేరారు. ఒడిశాలో విజయ పరంపరను కొనసాగించేందుకు పార్టీ వివిధ నియోజకవర్గాల్లో సంస్థాగత విభాగాలను బలోపేతం చేయడం ప్రారంభించింది. 2000-బ్యాచ్ IAS అధికారి అయిన ఆయన తమిళనాడు వాసి. ధర్మగర్ సబ్-కలెక్టర్‌గా తన వృత్తిని ప్రారంభించిన ఆయన తరువాత వివిధ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశాడు. 2011లో ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లో చేరిన ఆయన గత 12 ఏళ్లుగా ముఖ్యమంత్రి ప్రైవేట్‌ కార్యదర్శిగా పనిచేశారు. ఎన్నికలకు మరికొద్ది నెలలు మిగిలుండగా పాండ్యన్‌ సూపర్‌ సీఎంగా వ్యవహరిస్తారన్న వ్యాఖ్యలు వినవచ్చాయి. ఎన్నికల ముందుగా రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో మార్పులు, చేర్పులు తథ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.