NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం!
    తదుపరి వార్తా కథనం
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం!

    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2025
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఏ విషయాన్ని ప్రకటించబోతున్నారు?

    ఆపరేషన్ సిందూర్‌పై స్పందించబోతున్నారా? ఇతర కీలక అంశాలపై ప్రకటన వెలువడనుందా? అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.

    ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ గురించి త్రివిధ దళాధిపతులు జరిపిన ప్రెస్‌మీట్‌ ద్వారా పలు కీలక విషయాలను వెల్లడించారు.

    ఉగ్రవాదులకు అండగా నిలిచిన పాకిస్థాన్‌కు భారత్ గట్టి బుద్ధి చెప్పిందని త్రివిధ దళాధిపతులు స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ వైపు నుంచి ఏ దాడి వచ్చినా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని హితవు పలికారు.

    Details

    తాజా దాడుల్లో పాకిస్థాన్ కు తీవ్రమైన నష్టం

    ఇక పాకిస్థాన్‌లోని కిరణా హిల్స్‌లో అణుశక్తి కేంద్రం ధ్వంసమైన విషయంపై వస్తున్న వార్తలపైనా వారు స్పందించారు. తాజా దాడుల్లో పాకిస్థాన్‌కు తీవ్రమైన నష్టం జరిగినట్లు అర్థమవుతోంది.

    మరోవైపు, ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

    మతం పేరుతో సాగిన ఈ ఉగ్రదాడికి పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థల ప్రమేయం ఉందని భారత్ గుర్తించింది.

    దీంతోనే ప్రతీకారంగా భారత్‌ 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం దాడులకు పాల్పడి విజయం సాధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఇండియా

    తాజా

    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ
    Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక తెలంగాణ

    నరేంద్ర మోదీ

    PM Modi: సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లిన మోదీ.. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు హాజరు భారతదేశం
    Smart City Mission: పదేళ్లలో స్మార్ట్‌ సిటీలకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిన భారత్‌ ప్రధాన మంత్రి
    PM Modi: సౌదీ గగనంలో మోదీకి ఘన స్వాగతం.. ఎస్కార్ట్‌గా సౌదీ ఫైటర్‌ జెట్‌లు సౌదీ అరేబియా
    Donald Trump : జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. అండగా ఉంటామని హామీ డొనాల్డ్ ట్రంప్

    ఇండియా

    Indian Railways: తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం తిరుపతి
    Telangana: కంచ గచ్చిబౌలి భూ వివాదం.. హెచ్‌సీయూకు కేంద్ర సాధికారిక కమిటీ విచారణ తెలంగాణ
    Special Trains: వేసవి రద్దీకి ముందస్తు ఏర్పాట్లు.. తిరుపతికి 14 ప్రత్యేక రైళ్లు తిరుపతి
    Haryana: హాస్టల్‌లో కలకలం.. సూట్‌కేసులో గర్ల్‌ఫ్రెండ్‌ను దాచిన యువకుడు (వీడియో) హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025