తదుపరి వార్తా కథనం

Bheemili : భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
వ్రాసిన వారు
Stalin
Jun 26, 2024
03:18 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ భీమిలి లో పెంచిన కుక్క కరవటం వల్ల తండ్రి కొడుకులు మృతి చెందారు.
వివరాలలోకి వెళితే నర్సింగరావు(59), కొడుకు భార్గవ్(27) లను వారి పెంపుడు కుక్క కరిచింది.
భార్గవ్ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది.
ఈ ఘటన జరిగిన తర్వాత 2 రోజులకు కుక్క తీవ్ర అస్వస్థతకు గురైంది.
వెంటనే వారు అప్రమత్తమయ్యారు . యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు. కానీ అప్పటికే వారి హెల్త్ పాడైంది .
ఈక్రమంలో చికిత్స పొందుతూ తండ్రి,కొడుకులు మరణించారు.
ఇంట్లో కుక్కలకు కూడా క్రమంతప్పకుండా.. డీవార్మింగ్, వ్యాక్సినేషన్ చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు.