English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arsenic: బియ్యంలో ఆర్సెనిక్‌ భయం.. ప్రపంచవ్యాప్తంగా 20% మందికి క్యాన్సర్‌ ముప్పు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Arsenic: బియ్యంలో ఆర్సెనిక్‌ భయం.. ప్రపంచవ్యాప్తంగా 20% మందికి క్యాన్సర్‌ ముప్పు!
    బియ్యంలో ఆర్సెనిక్‌ భయం.. ప్రపంచవ్యాప్తంగా 20% మందికి క్యాన్సర్‌ ముప్పు!

    Arsenic: బియ్యంలో ఆర్సెనిక్‌ భయం.. ప్రపంచవ్యాప్తంగా 20% మందికి క్యాన్సర్‌ ముప్పు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 22, 2025
    10:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వాతావరణ మార్పుల ప్రభావంతో బియ్యంలో ఆర్సెనిక్‌ స్థాయిలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

    క్యాన్సర్‌కు ప్రధాన కారకాల్లో ఒకటైన ఆర్సెనిక్‌ విషపూరితత 2050 నాటికి మరింత తీవ్రమవుతుందని తాజా అధ్యయన నివేదిక వెల్లడించింది.

    ఈ నివేదిక లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. అధ్యయనంలో పేర్కొన్న వివరాల ప్రకారం, ప్రపంచ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే నేలలో నిర్మాణ మార్పులు వస్తాయి.

    అలాగే వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిలు పెరిగితే వరి మొక్కల జీవన విధానంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా ఆ మొక్కలు ఆర్సెనిక్‌ను పీల్చుకునే శక్తిని పెంచుకుంటాయి.

    Details

    భారతదేశంలో ప్రభావం

    ప్రపంచ వ్యాప్తంగా ప్రతేడాది సుమారు 54 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అవుతోంది. ఇందులో 27 శాతం వరి భారతదేశంలోనే పండుతోంది.

    వాతావరణ మార్పులతో వరి లోపల ఆర్సెనిక్‌ చేరడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

    ముఖ్యంగా ఆసియా, ఆగ్నేయాసియాలో వరి పంట సాగు విస్తృతంగా ఉండటంతో ఈ ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    Details

    ఆరోగ్య ముప్పు పెరుగుతోంది 

    వాతావరణ మార్పుల వల్ల ఈ కాలుష్యం మరింత పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. దీని ఫలితంగా క్యాన్సర్‌, గుండెజబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు పెరగవచ్చని తెలిపారు.

    కాలుష్యమైన మట్టి, సాగునీటిలో ఆర్సెనిక్‌ ఉండటం పెద్ద సమస్య. పైగా, ఆ నీటిని వంటకు ఉపయోగించడం వల్ల ఆహారంలో ఆర్సెనిక్‌ చేరి ముప్పు మరింత తీవ్రతరమవుతుంది.

    2050 నాటికి ఆసియా దేశాల్లో లక్షలాది క్యాన్సర్‌ కేసులు నమోదుకావచ్చని, ముఖ్యంగా ఊపిరితిత్తులు, ప్రొస్టేట్‌ క్యాన్సర్లు పెరగవచ్చని అధ్యయనం హెచ్చరిస్తోంది.

    అదే సమయంలో చైనాలో ఒక్కటే 1.34 కోట్ల ఆర్సెనిక్‌ సంబంధిత క్యాన్సర్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రభావం కూడా వృద్ధి చెందుతుందని నివేదిక హితవుపలికింది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్యాన్సర్
    భారతదేశం

    తాజా

    Muhammad Yunus: మరోసారి ఈశాన్య రాష్ట్రాలపై నోరు పారేసుకున్న ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్
    BSF Jawan: బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాకిస్థాన్ భారతదేశం
    Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో 9,500 బంకర్లు..! జమ్ముకశ్మీర్
    Miss World 2025: చార్మినార్‌.. లాడ్‌బజార్‌లో సుందరీమణుల షాపింగ్‌.. చౌమొహల్లా ప్యాలెస్‌ వరకు హెరిటేజ్‌ వాక్‌  హైదరాబాద్

    క్యాన్సర్

    అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్ చికిత్స; ఛాతి నుంచి చర్మం తొలగింపు జో బైడెన్
    Nutmeg: క్యాన్సర్‌తో 'న్యూట్‌మెగ్' కో ఫౌండర్ నిక్ హంగర్‌ఫోర్డ్ మృతి బ్రిటన్
    బరువు తగ్గించే గ్రీన్ టీని ఎలా తయారు చేసుకోవాలి, ఏ సమయాల్లో తాగితే ఉత్తమం!  బరువు తగ్గడం
    Noni Fruit: ఈ పండు తింటే చాలు.. క్యాన్సర్‌తో పాటు మరెన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు ఆయుర్వేదం

    భారతదేశం

    work-life balance:కుటుంబానికే ప్రాధాన్యత అంటున్నభారతదేశంలోని ఉద్యోగులు .. వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌పై 78% మంది అభిప్రాయమిదే!  భారతదేశం
    Infosys: ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మంది తొలగింపు ఇన్ఫోసిస్
    India Deports: అక్రమ వలసదారులపై భారత్ ఉక్కుపాదం.. ఫస్ట్ బ్యాచ్ లో 16 మంది విదేశీయులు  భారతదేశం
    India-US:అమెరికాలో దాక్కున్న గ్యాంగ్‌స్టర్ల జాబితా సిద్ధం చేసిన భారత్!   అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025