NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / UP: ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
    తదుపరి వార్తా కథనం
    UP: ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
    చిన్నారుల సజీవ దహనం .. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

    UP: ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 16, 2024
    10:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలో శుక్రవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

    ఈ ఘటనలో 10 మంది చిన్నారులు సజీవంగా దగ్ధమయ్యారు. అగ్ని ప్రమాదం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. న్యూఓనేటల్‌ ఐసీయూలో మంటలు చెలరేగడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

    ఈ ఘటన వల్ల ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది.

    ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి, స్థానిక అధికారులు పర్యవేక్షణ చేపట్టారు.

    Details

    రూ. 5లక్షలు నష్టపరిహారం

    ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించగా, గాయపడిన వారికి రూ.50వేలు ఇచ్చేందుకు ఆదేశించారు.

    ఝాన్సీలోని మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం బాధాకరమని, ఈ ఘటనలో తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ చెప్పారు.

    భగవంతుడు వారికి ఈ అపార నష్టాన్ని భరించడానికి శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

    షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయని జిల్లా కలెక్టర్ అవినాశ్‌కుమార్‌ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    నరేంద్ర మోదీ

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    ఉత్తర్‌ప్రదేశ్

    Uttarpradesh : నక్కతో పోరాడి తమ్ముడిని రక్షించుకున్న అక్క లక్నో
    Dibrugarh Express Accident:  గోండా రైలు ప్రమాదంలో వైరల్ అవుతున్న ఆడియో..  భారతదేశం
    Kanwar Yatra: కన్వర్ యాత్ర ఆర్డర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించనున్న సుప్రీం  భారతదేశం
    Uttarpradesh: 'లవ్ జిహాద్' బిల్లుకు యోగి సర్కార్ ఆమోదం భారతదేశం

    నరేంద్ర మోదీ

    Gandhi Jayanti: రాజ్‌ఘాట్‌‌లో గాంధీజీకి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ  మహాత్మా గాంధీ
    Narendra Modi: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టిన ప్రధాని మోదీ మహాత్మా గాంధీ
    Pm Internship Scheme: నేటి నుంచి పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం.. ప్రాసెస్ ప్రయోజనాలను తెలుసుకోండి భారతదేశం
    West Asia Crisis: మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. మోదీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025