NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మేఘాలయ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవుట్‌పోస్ట్‌పై దాడి: ఐదుగురి గాయాలు
    తదుపరి వార్తా కథనం
    మేఘాలయ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవుట్‌పోస్ట్‌పై దాడి: ఐదుగురి గాయాలు
    మేఘాలయ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవుట్‌పోస్ట్‌పై దాడి: ఐదుగురి గాయాలు

    మేఘాలయ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవుట్‌పోస్ట్‌పై దాడి: ఐదుగురి గాయాలు

    వ్రాసిన వారు Stalin
    Jun 26, 2023
    03:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో సరిహద్దు ఔట్‌పోస్ట్‌పై ఆదివారం రాత్రి గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందితో సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

    దవ్కీ పట్టణానికి సమీపంలోని ఉమ్సీయమ్ గ్రామంలో రాత్రి 10గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు సోమవారం తెలిపారు.

    బీఎస్ఎఫ్ మేఘాలయ ఫ్రాంటియర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా, మేము బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలించడానికి ఉద్దేశించిన భారీ సంఖ్యలో వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

    స్మగ్లర్లను కూడా గుర్తించినట్లు చెప్పారు. దీని కారణంగానే బీఎస్ఎఫ్ అవుట్‌పోస్ట్‌పై దాడి చేయడానికి స్మగ్లర్లు ఒక గుంపును పంపినట్లు పేర్కొన్నారు.

    బీఎస్ఎఫ్

    బీఎస్ఎఫ్ సిబ్బంది డ్యూటీలో మద్యం తాగి ఉన్నారని గ్రామస్తులు ఆరోపణ

    గ్రామస్థుల మూకదాడిలో ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బంది గాయపడ్డారని ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.

    కొంతమంది గ్రామస్థులు బలవంతంగా అవుట్‌పోస్ట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని, వారిని వెనక్కి నెట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలో ముగ్గురు గ్రామస్తులు కూడా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

    ముగ్గురు ప్రయాణికులతో కూడిన వాహనం ఔట్‌పోస్టు సమీపంలో చెడిపోవడంతో బీఎస్ఎఫ్ సిబ్బంది వారిని స్మగ్లర్లుగా అనుమానించారు. వారిపై పలు అభియోగాలు మోపారు.

    దీనిపై ఆగ్రహానికి గురైన సమీపంలోని గ్రామస్థులు వారిని రక్షించడానికి వచ్చారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.

    అయితే బీఎస్ఎఫ్ సిబ్బంది డ్యూటీలో మద్యం తాగి ఉన్నారని గ్రామస్తులు ఆరోపించగా, దానిని ఐజీ ప్రదీప్ కుమార్ ఖండించారు. సరిహద్దులోని సిబ్బంది మద్యం తాగడానికి అనుమతి లేదని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మేఘాలయ
    తాజా వార్తలు

    తాజా

    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ
    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్
    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్

    మేఘాలయ

    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల త్రిపుర
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? అసెంబ్లీ ఎన్నికలు

    తాజా వార్తలు

    పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం పాకిస్థాన్
    WEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే?  భారతదేశం
    బార్బెక్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ పేలి 31మంది మృతి చైనా
    వైట్‌హౌస్‌లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025