NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్
    తదుపరి వార్తా కథనం
    ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్
    ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్

    ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్

    వ్రాసిన వారు Stalin
    Jan 13, 2023
    06:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్ గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ ఇద్దరు రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. ఈ భేటీలో గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్ ఉన్నారు.

    జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్‌ను నిలపాలని సీఎం కేసీఆర్ చేస్తున్న నేపథ్యంలో.. గమాంగ్ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది.

    గిరిధర్ గమాగ్ ఫిబ్రవరి 17, 1999 నుంచి డిసెంబరు 6, 1999 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, గమాంగ్ తొమ్మిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2015లో బీజేపీలో చేరారు.

    బీఆర్ఎస్

    ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ

    బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా పలు రాష్ట్రాల్లోని ముఖ్య నేతలను సీఎం కలుస్తున్నారు. అందులో భాగంగానే ఒడిశా మాజీ ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాచారం. ఆయన బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే ఏపీ అధ్యక్షుడిని ప్రకటించిన సీఎం కేసీఆర్.. మిగతా రాష్ట్రాల్లో అధ్యక్షులను నియమించే అంశంపై దృష్టి సారించారు.

    ఇదిలా ఉంటే.. ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో భారీగా పార్టీలో చేరికలు ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్ తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? ఆంధ్రప్రదేశ్
    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025