NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం!
    తదుపరి వార్తా కథనం
    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం!
    బీఆర్ఎస్ తొలి సభను నిర్వహించేందుకు కేసీఆర్ సన్నాహాలు

    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం!

    వ్రాసిన వారు Stalin
    Jan 09, 2023
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత పార్టీ తొలి బహిరంగ సభను నిర్వహించేందుకు అధినేత కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. వాస్తవానికి తొలి‌సభను దిల్లీలోనే ఏర్పాటు చేయాలని భావించినా.. అది సాధ్యం కాలేదు. దీంతో సభా వేదికను మార్చాలని నిర్ణయించారు.

    2018 ఎన్నికల్లో పార్టీకి అతి తక్కువ స్థానాలు అందించిన ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి భారీ సభకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ‌నెల 18న ఈ సభ ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం ఖమ్మం టీఆర్ఎస్‌లో అనిశ్చితి నెలకొంది.

    పొంగులేటి పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేత తుమ్మల కూడా అసంతృప్తిగా ఉండటంతో పాటు ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సభ విజయవంతమైన నేపథ్యంలో జిల్లాలోని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించేందుకు ఖమ్మాన్ని కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

    కేసీఆర్

    బీజేపీని వ్యతిరేకించే నాయకులకు ఆహ్వానం!

    బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను జాతీయస్థాయిలో చర్చించుకునేలా భారీగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. సభకు పార్టీ శ్రేణులను భారీగా తరలించడంతో పాటు.. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే జాతీయ నాయకులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారట.

    కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లకు కేసీఆర్ ఆహ్వానం పంపినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కూడా కేసీఆర్ ఆహ్వానించిట్లు సమాచారం.

    ఈ సభకు జాతీయ నాయకులను ఆహ్వానించి.. విపక్షాల ఐక్యతను చాటాలనేది కేసీఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వడంతో కేసీఆర్ ఖమ్మం సభను తొలి అడుగ్గా భావిస్తన్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    తాజా

    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? తెలంగాణ
    బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం వేగవంతం.. కేసీఆర్ ఫోకస్ భారతదేశం
    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025