NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా?
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా?
    బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్న ఏపీకి చెందిన సీనియర్ నేతలు

    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా?

    వ్రాసిన వారు Stalin
    Jan 02, 2023
    12:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి విస్తరణపై అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. వీలైనంత త్వరలో ఏపీలో పార్టీ కార్యాలయాలన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఏపీలో పార్టీని నడిపే నాయకుల జాబితాను ఇప్పటికే ఖరారు చేశారట. కీలక నాయకుల పేర్లు ఇప్పడు బయటకు వచ్చాయి. వీరందరూ సోమవారం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

    బీఆర్ఎస్‌లో చేరేవారిలో ముఖ్యంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు మాజీ మంత్రి రావెల కిషోర్‍బాబు కాగా.. మరొకరు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి.. ఇంకొకరు తోట చంద్రశేఖర్. టీజే ప్రకాశ్ కూడా బీఆర్ఎస్‌లో చేరనున్నారట.

    ఏపీలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌కు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    ఆంధ్రప్రదేశ్

    రాష్ట్ర, కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన అనుభవం

    తోట చంద్రశేఖర్, పార్థసారథి, కిషోర్‍బాబుకు రాజకీయ అనుభవంతో పాటు రాష్ట్ర, కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ క్రమంలో వీరు ఏపీలో పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తారనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.

    మాజీ ఐఆర్ఎస్ అధికారి కోవెల కిషోర్‍బాబు.. 2014లో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొంది.. చంద్రబాబు మంత్రవర్గంలో పనిచేశారు. కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

    ఐఏఎస్ అధికారిగా ఉండి స్వచ్ఛంద పదవీవిరమణ పొంది.. ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. 2009లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ, 2019లో జనసేన తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

    మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారధి 2019లో జనసేన ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఆంధ్రప్రదేశ్
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్ తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? చంద్రబాబు నాయుడు
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ వై.ఎస్.జగన్

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? తెలంగాణ
    బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం వేగవంతం.. కేసీఆర్ ఫోకస్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025