
Andhra Pradesh: అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన గజేంద్రసింగ్ షెకావత్, పవన్ కల్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
రాజమహేంద్రవరం నగరంలో ప్రారంభమవుతున్నఅఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల మంత్రిగజేంద్రసింగ్ షెకావత్,ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్,లోక్సభ సభ్యురాలు పురందేశ్వరి హాజరయ్యారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద రూ.94.44కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికారు. ఈప్రాజెక్టు ద్వారా చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విదేశీపర్యాటకులను ఆకర్షించేలా నగరం,పరిసర ప్రాంతాలను నూతనంగా అభివృద్ధి చేయాలనే దిశగా ఈ ప్రణాళికను రూపుదిద్దారు. 2025పుష్కరాల నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసేలా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోని"Special Assistance to States for Capital Investment(SASCI)" పథకం కింద ఈప్రాజెక్టుకు నిధులు మంజూరయ్యాయి.
వివరాలు
బ్రిడ్జిలంక ప్రాంతం హేవలాక్ వంతెన,రోడ్కం రైల్వే బ్రిడ్జిల మధ్య ఉంది
ఈ మొత్తం రూ.94.44 కోట్లతో పుష్కరాల రేవు అభివృద్ధి చేయడం,127 ఏళ్ల చరిత్ర కలిగిన హేవలాక్ వంతెనకు కొత్త రూపమివ్వడం,అలాగే గోదావరి నదీ మధ్యలో ఉన్న 116.97 ఎకరాల బ్రిడ్జిలంక ప్రాంతాన్నివినోదకేంద్రముగా అభివృద్ధి చేయనున్నారు. ఈ బ్రిడ్జిలంక ప్రాంతం హేవలాక్ వంతెన,రోడ్కం రైల్వే బ్రిడ్జిల మధ్య ఉంది. ప్రాజెక్టు పూర్తయ్యాక రాజమహేంద్రవరం ప్రాంతానికి ఏడాదికి సగటున 18 నుంచి 20 లక్షల పర్యాటకులు రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పర్యాటక రంగం పుష్కలంగా అభివృద్ధి చెందడం ద్వారా స్థానికంగా హోటళ్లు,రెస్టారెంట్లు, రవాణా,ఇతర సేవల రంగాల్లో వేగంగా అవకాశాలు పెరగనున్నాయి. దీని ఫలితంగా నేరుగా,పరోక్షంగా సుమారు 8వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు అంచనా వేయబడుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మంత్రి కందుల దుర్గేష్ చేసిన ట్వీట్
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంఖుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెఖావత్ గారికి రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడం జరిగింది.@gssjodhpur @BattulaBalarama pic.twitter.com/nqiL7Z5Pqq
— Kandula Durgesh (@kanduladurgesh) June 26, 2025