NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!
    భారతదేశం

    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!

    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 11, 2023, 03:38 pm 1 నిమి చదవండి
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!
    రోజురోజుకు ముదురుతున్న తమిళనాడు గవర్నర్ వివాదం

    తమిళనాడు ప్రభుత్వం.. గవర్నర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. రోజుకో నాటకీయ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్‌కు వ్యతిరకేంగా #GetOutRavi హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ ట్రెండ్ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో చాలా రోజులుగా ప్రభుత్వానికి గవర్నర్‌కు సఖ్యత లేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మార్చి.. గవర్నర్ టీఎన్ రవి చదవడంతో వివాదం మరింత ముదరింది. ఈ సమయంలో అధికార డీఎంకే శాసనసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గవర్నర్ రవి ప్రసంగానికి వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ సంఘటతో గవర్నర్- ప్రభుత్వం మధ్య వివాదం ముదిరి పాకాక పడింది.

    గవర్నర్ రవికి వ్యతిరేకంగా పోస్టర్లు

    అసెంబ్లీ పరిణామం అనంతరం తమిళనాడు అంతటా గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. చెన్నైలో గవర్నర్ రవికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఆ తర్వాత.. సోషల్ మీడియాలోనూ గవర్నర్ వ్యతిరకేంగా #GetOutRavi హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ల వర్షం కురిసింది. ఇవన్ని చేసిందంతా.. డీఎంకే శ్రేణులేనని ప్రచారం జరుగుతోంది. అలాగే.. తమిళనాడు పేరును 'తమిళగం'గా గవర్నర్ మార్చడంపై కూడా రాష్ట్రంలో పెద్ద వివాదమే చెలరేగింది. దీనిపై అన్ని పార్టీలు గవర్నర్‌పై విరుచుకుపడ్డాయి. పొంగల్ ఆహ్వాన పత్రికపై కూడా.. తమిళనాడు ముద్రను గవర్నర్ తొలగించి.. కేంద్ర ప్రభుత్వ ముద్రను వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా రాజ్ భవన్ ఎదుట నిరసన తెలిపే ఆలోచనలో డీఎంకే శ్రేణులు ఉన్నట్లు సమాచారం.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    తమిళనాడు
    గవర్నర్

    తాజా

    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో
    మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    తమిళనాడు

    బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం ఇండియా లేటెస్ట్ న్యూస్
    Tamil Nadu: బీజేపీతో విభేదాలు ఉన్నా.. పొత్తు కొనసాగుతుంది: ఏఐఏడీఎంకే బీజేపీ
    తమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం! ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు

    గవర్నర్

    వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి: గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్ తమిళసై సౌందరరాజన్
    పెండింగ్ బిల్లులు‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం తమిళసై సౌందరరాజన్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023