NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!
    తదుపరి వార్తా కథనం
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!
    రోజురోజుకు ముదురుతున్న తమిళనాడు గవర్నర్ వివాదం

    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!

    వ్రాసిన వారు Stalin
    Jan 11, 2023
    03:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు ప్రభుత్వం.. గవర్నర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. రోజుకో నాటకీయ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్‌కు వ్యతిరకేంగా #GetOutRavi హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ ట్రెండ్ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది.

    తమిళనాడులో చాలా రోజులుగా ప్రభుత్వానికి గవర్నర్‌కు సఖ్యత లేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మార్చి.. గవర్నర్ టీఎన్ రవి చదవడంతో వివాదం మరింత ముదరింది. ఈ సమయంలో అధికార డీఎంకే శాసనసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    అనంతరం గవర్నర్ రవి ప్రసంగానికి వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ సంఘటతో గవర్నర్- ప్రభుత్వం మధ్య వివాదం ముదిరి పాకాక పడింది.

    తమిళనాడు

    గవర్నర్ రవికి వ్యతిరేకంగా పోస్టర్లు

    అసెంబ్లీ పరిణామం అనంతరం తమిళనాడు అంతటా గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. చెన్నైలో గవర్నర్ రవికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఆ తర్వాత.. సోషల్ మీడియాలోనూ గవర్నర్ వ్యతిరకేంగా #GetOutRavi హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ల వర్షం కురిసింది. ఇవన్ని చేసిందంతా.. డీఎంకే శ్రేణులేనని ప్రచారం జరుగుతోంది.

    అలాగే.. తమిళనాడు పేరును 'తమిళగం'గా గవర్నర్ మార్చడంపై కూడా రాష్ట్రంలో పెద్ద వివాదమే చెలరేగింది. దీనిపై అన్ని పార్టీలు గవర్నర్‌పై విరుచుకుపడ్డాయి.

    పొంగల్ ఆహ్వాన పత్రికపై కూడా.. తమిళనాడు ముద్రను గవర్నర్ తొలగించి.. కేంద్ర ప్రభుత్వ ముద్రను వేశారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా రాజ్ భవన్ ఎదుట నిరసన తెలిపే ఆలోచనలో డీఎంకే శ్రేణులు ఉన్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తమిళనాడు

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి భారతదేశం
    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక ఎలక్ట్రిక్ వాహనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025