Page Loader
Telangana: వైద్య విద్యార్థులకు శుభవార్త.. స్టైపెండ్‌ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం
వైద్య విద్యార్థులకు శుభవార్త.. స్టైపెండ్‌ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana: వైద్య విద్యార్థులకు శుభవార్త.. స్టైపెండ్‌ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో యూజీ, పీజీ వైద్య విద్యార్థులకు శుభవార్త అందింది. వారి స్టైపెండ్‌ను ప్రభుత్వం 15 శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా జీవో విడుదల చేసింది. ఈ పెంపుదల ఈ ఏడాది జనవరి నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఉన్న విద్యార్థులకు ఇచ్చే గౌరవ వేతనం నెలకు రూ.లక్ష దాటనుంది. ఇది ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎంతో ఎక్కువగా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Details

సమ్మెను విరమించిన జుడాలు

ఇకపోతే 15 శాతం స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే జూన్ 30 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం డిమాండ్ మేరకు స్పందించి భత్యం పెంచిన నేపథ్యంలో, జూడాలు సమ్మె ఆలోచనను విరమిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను జూడాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.