Page Loader
Jayesh Ranjan: క్రీడాకారులకు శుభవార్త.. తెలంగాణలో కొత్త క్రీడా పాలసీ!
క్రీడాకారులకు శుభవార్త.. తెలంగాణలో కొత్త క్రీడా పాలసీ!

Jayesh Ranjan: క్రీడాకారులకు శుభవార్త.. తెలంగాణలో కొత్త క్రీడా పాలసీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒలింపిక్స్‌ వేదికపై తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 14 ప్రాంతాల నుంచి విద్యార్థులు ఒలింపిక్ రన్‌ ద్వారా స్టేడియానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ, "ప్రపంచంలోని అనేక దేశాలు ఒలింపిక్స్‌లో తమ సత్తా చాటుతున్నాయి. మన రాష్ట్రం కూడా అదే స్థాయికి చేరుకోవాలని తెలిపారు. అంతేకాక ఒలింపిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించనున్నట్టు చెప్పారు.

Details

క్రీడాకారులకు మంచి భవిష్యత్తు

ఈరోజే జరగనున్న తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం కొత్త క్రీడా పాలసీని ప్రతిష్ఠాత్మకంగా ఆమోదించనుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కొత్త క్రీడా పాలసీని రూపొందిస్తోందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. తద్వారా క్రీడాకారులకు మంచి ప్రోత్సాహకాలు ఉంటాయి. గత ప్రభుత్వంలో అనేక మంది క్రీడాకారులకు న్యాయం జరగలేదు. ఇప్పుడు వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, పారా ఒలింపిక్ పతక విజేత దీప్తి జివాంజీ పాల్గొన్నారు.