
TG Govt: డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వ గుడ్ న్యూస్.. పెన్షన్లు మంజూరు!
ఈ వార్తాకథనం ఏంటి
డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మే నెలలో 4,021 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ.2,016 పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కేవలం 4,011 మందికే డయాలసిస్ పెన్షన్లు వచ్చేవని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ఒక్క మే నెలలోనే అంతకంటే ఎక్కువ మంది రోగులకు పెన్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొంది. మంత్రి సీతక్క చొరవతో కొత్త లబ్ధిదారుల ఎంపిక జరిగింది.
Details
హెచ్ఐవీ రోగులకు ఫించన్లు మంజూరు
డయాలసిస్ రోగులకు పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వం, త్వరలో హెచ్ఐవీ రోగులకు కూడా పెన్షన్లు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే 13,000 మంది హెచ్ఐవీ బాధితులు పెన్షన్లు మంజూరు చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. త్వరలో అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖ అనుమతులు కోరింది. \ అనుమతులు వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు అందించడం ప్రారంభిస్తారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు రూ.993 కోట్లు ఖర్చు చేస్తోంది.