NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bengaluru: ట్రాఫిక్‌కు గుడ్‌బై.. డ్రోన్‌తో కేవలం 7 నిమిషాల్లోనే సరకులు డెలివరి
    తదుపరి వార్తా కథనం
    Bengaluru: ట్రాఫిక్‌కు గుడ్‌బై.. డ్రోన్‌తో కేవలం 7 నిమిషాల్లోనే సరకులు డెలివరి
    ట్రాఫిక్‌కు గుడ్‌బై.. డ్రోన్‌తో కేవలం 7 నిమిషాల్లోనే సరకులు డెలివరి

    Bengaluru: ట్రాఫిక్‌కు గుడ్‌బై.. డ్రోన్‌తో కేవలం 7 నిమిషాల్లోనే సరకులు డెలివరి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 29, 2025
    10:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు స్కై ఎయిర్‌ సంస్థ ముందుకొచ్చింది. డ్రోన్ల ద్వారా కొద్ది నిమిషాల్లోనే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.

    బెంగళూరులోని కోణనకుంట, కనకపుర రోడ్డు ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభించిందని వెల్లడించింది.

    డ్రోన్లు కేవలం 7 నిమిషాల్లోనే సరకులను అందజేస్తాయని స్కై ఎయిర్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్‌ కుమార్‌ తెలిపారు.

    ఇప్పటికే నగరంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించగా, చక్కటి ఫలితాలు వస్తోన్నట్లు వివరించారు.

    బ్లూడార్ట్, డీటీడీసీ, షిప్‌ రాకెట్, ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్, శ్రీమారుతి వంటి ప్రముఖ డెలివరీ సంస్థల ఆర్డర్లను డ్రోన్లతో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

    Details

    10 కిలోల బరువుతో 120 మీటర్ల ఎత్తు ఎగరగలవు

    గతంలో గురుగ్రామ్‌లో ఈ సేవలను ప్రారంభించగా, వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని అన్నారు.

    తమ డ్రోన్లు ఒక ట్రిప్‌లో 10 కిలోల బరువుతో 120 మీటర్ల ఎత్తులో ఎగరగలవని, సొరంగ మార్గాల్లోనూ ప్రయాణించగలవని వెల్లడించారు.

    డెలివరీ పూర్తయిన తర్వాత డ్రోన్లు స్వయంచాలకంగా బయల్దేరిన స్థానానికి తిరిగి చేరుతాయని చెప్పారు.

    దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలను అధిగమించి, తక్కువ సమయంలో వేగవంతమైన సేవలను అందించగలమని అంకిత్‌ కుమార్‌ తెలిపారు.

    డ్రోన్లలో బ్లాక్‌బాక్స్‌లు కూడా ఉండటంతో రికార్డింగ్‌కు సౌలభ్యం ఉంటుందని వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    Pillalamarri Banyan Tree: నేడు పాలమూరుని సందర్శించనున్న ప్రపంచ అందగత్తెలు !  తెలంగాణ
    SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు   స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    unemployment data: దేశంలో తొలిసారిగా నెలవారీ ఉద్యోగ గణాంకాలు.. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1శాతం కేంద్ర ప్రభుత్వం
    Anurag Kashyap: లాభాల కోసం కళను తాకట్టు పెట్టిన ఓటీటీ వేదికలు : అనురాగ్ కశ్యప్‌ ఓటిటి

    బెంగళూరు

    Bengaluru: బెంగళూరు హత్యకేసు.. అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తింపు ఇండియా
    Bengaluru Horror: బెంగళూరు మహిళ హత్య కేసు.. ఒడిశాలోని చెట్టుకు ఉరేసుకున్న నిందితుడు.. సూసైడ్ నోట్ స్వాధీనం ఒడిశా
    Nirmala Sitharaman: ఎన్నికల బాండ్ల వివాదం.. నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు ఆదేశాలు నిర్మలా సీతారామన్
    Bomb Threat: బెంగళూరులోని 'తాజ్ వెస్ట్ ఎండ్' హోటల్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా తనిఖీలు బాంబు బెదిరింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025