NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక
    తదుపరి వార్తా కథనం
    Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక
    ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక

    Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2025
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సమాచార కమిషన్‌లో కమిషనర్లుగా నలుగురిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

    పీవీ శ్రీనివాస రావు, మోసిన పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిలను ఎంపిక చేశారు.

    కమిషనర్లుగా ఏడుగురిని నియమించనున్నట్లు ముందుగా ఊహాగానాలు వచ్చినప్పటికీ, ప్రభుత్వం ఈ దశలో నలుగురితో ప్రారంభించింది.

    పీవీ శ్రీనివాస రావు ఖమ్మం జిల్లా వాసి కాగా, సీనియర్ జర్నలిస్టుగా అనుభవం కలిగినవారు. అయోధ్య రెడ్డి యదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవారు.

    ఆయన గతంలో సీఎం సీఎల్పీఆర్వోగా పనిచేశారు. మైనార్టీ కోటాలో మోసిన పర్వీన్ నియమితురాలవగా, దేశాల భూపాల్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక

    Details

    10,688 ఆర్టీఐ అప్పీళ్లు పెండింగ్‌

    ఇటీవలే మే 5న ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1991 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. చంద్రశేఖర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి చెందిన బోరెగాన్ గ్రామ వాసి.

    రెండేళ్లుగా సమాచార కమిషన్‌లో పదవులు ఖాళీగా ఉండటంతో దాదాపు 10,688 ఆర్టీఐ అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.

    ఈ నియామకాల్లో జాప్యం పై సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని వేగంగా నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించింది.

    ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా నియామకాలను చేపట్టింది.

    ఎంపికైన వారి జాబితాను రాజ్ భవన్‌కు పంపగా, గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక తెలంగాణ
    Stock Market: కాల్పుల విరమణ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ కొత్త అప్డేట్.. డబ్బులు ఖాతాల్లో పడాలంటే ఈ విధంగా చేయండి!  ఆంధ్రప్రదేశ్
    Virat Kohli: టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ 5 టాప్ ఇన్నింగ్స్ ఇవే! విరాట్ కోహ్లీ

    తెలంగాణ

    Revanth Reddy: పరువు నష్టం కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్‌ పిటిషన్‌ రేవంత్ రెడ్డి
    NIRD: గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా ఎన్‌ఐఆర్‌డీ గుర్తింపు.. కేంద్రం గ్రాంటు నిలిపివేతతో మూసివేత ప్రమాదం భారతదేశం
    TG ENC: గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు.. బనకచర్ల లింక్ విషయం ప్రస్తావన భారతదేశం
    Telangana: తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025