NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Budget 2025: వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్‌.. కొత్త రైల్వే మార్గాల ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Budget 2025: వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్‌.. కొత్త రైల్వే మార్గాల ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..!
    వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్‌.. కొత్త రైల్వే మార్గాల ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..!

    Budget 2025: వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్‌.. కొత్త రైల్వే మార్గాల ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 28, 2025
    02:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే నెల ఒకటిన కేంద్ర బడ్జెట్‌లో భాగంగా రైల్వేకు కేటాయించే నిధుల్లో రాష్ట్రానికి ఎంత మేరకు అందజేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

    రాష్ట్రానికి ప్రాధాన్యత కలిగిన కొత్త రైల్వే మార్గాలు, అదనంగా లైన్ల నిర్మాణం, రైళ్లు వంటి ప్రాజెక్టులకు ప్రస్తుతం రూ. 83,543 కోట్లు అవసరం ఉంది.

    ఈ ప్రాజెక్టులతో పాటు మరిన్ని రైలు మార్గాలు, ప్రాజెక్టులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం జోరుగా కోరుతోంది.

    తెలంగాణకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విన్నవించింది.

    రాష్ట్రంలో అనుసంధానం లేని తొమ్మిది జిల్లా కేంద్రాలకు రైలు మార్గాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

    వివరాలు 

    హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు మార్గానికి నిధుల మంజూరు

    తెలంగాణలో భద్రాచలం, మేడారం, రామప్ప వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నిర్మల్, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు వంటి జిల్లా కేంద్రాలకు ఇప్పటికీ రైల్వే మార్గాలు లేవు.

    హైదరాబాద్ మెట్రో రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

    అలాగే,ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మంగళూరుకు ఉన్న రైలు తమిళనాడు,కేరళ మీదుగా ప్రయాణిస్తోంది.

    బెంగళూరు, కుక్కే సుబ్రహ్మణ్య స్టేషన్ల మీదుగా సూపర్‌ఫాస్ట్ రైలు నడిపితే ప్రయాణ దూరం,సమయం గణనీయంగా తగ్గుతుంది.

    హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు మార్గం అభివృద్ధి చేయడానికి నిధుల మంజూరు ఇంకా పెండింగ్‌లో ఉంది.

    అసెంబ్లీ ఎన్నికల ముందు దీన్ని కేంద్రం స్వయంగా చేపడతామని చెప్పినా, ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు.

    వివరాలు 

    తగ్గనున్న హైదరాబాద్ నుంచి గోవాకు ప్రయాణ దూరం

    సికింద్రాబాద్-కాజీపేట మూడో లైన్ నిర్మాణం 2014లో సర్వేకు అనుమతించినా, 2018లో రైల్వే బోర్డుకు నివేదిక సమర్పించినప్పటికీ పనులు ఇంకా పూర్తి కాలేదు.

    రీజినల్ రింగు రోడ్డుకు అనుబంధంగా రైల్వే లైన్ నిర్మాణం చేపడతామని కేంద్రం ప్రకటించినా, ఈ ప్రాజెక్టుకు రూ. 12,408 కోట్లు అవసరం అనే అంచనా ఉంది.

    వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కృష్ణా వరకూ 122 కిలోమీటర్ల రైలుమార్గానికి 2010లోనే సర్వే చేపట్టినా, నిర్మాణ వ్యయం రూ. 787 కోట్లుగా అంచనా వేసినా, ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పురోగతి సాధించలేదు. ఇది పూర్తి అయితే హైదరాబాద్ నుంచి గోవాకు ప్రయాణ దూరం తగ్గుతుంది.

    వివరాలు 

    62 కిలోమీటర్ల కొత్త ట్రాక్ నిర్మాణానికి 2011లోనే సర్వే

    శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడకు 220 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సెమీ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు గతేడాది రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.

    ఈ ప్రాజెక్టు సర్వే ఇప్పటికీ కొనసాగుతోంది. కరీంనగర్-హసన్‌పర్తి మధ్య 62 కిలోమీటర్ల కొత్త ట్రాక్ నిర్మాణానికి 2011లోనే సర్వే జరిగింది.

    దీని నిర్మాణానికి రూ. 464 కోట్లు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం వ్యయం రూ. 1,116 కోట్లకు పెరిగినా పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

    హసన్‌పర్తి నుంచి భూపాలపల్లి వరకు రైలుమార్గం ఇంకా పెండింగ్‌లో ఉంది.

    మణుగూరు నుంచి మేడారం మీదుగా రామగుండం వరకూ కొత్త రైల్వే మార్గం కోసం అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా వేచి చూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బడ్జెట్‌ 2025
    తెలంగాణ

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    బడ్జెట్‌ 2025

    Budget 2025 : బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభించనుందా? బిజినెస్
    New Income Tax Act: బడ్జెట్ 2025 ఆదాయపు పన్ను చట్టాన్ని కొత్త ప్రత్యక్ష పన్ను కోడ్‌తో భర్తీ చేస్తుందా?   బిజినెస్
    Budget : బడ్జెట్ 2025.. ఆదాయ శ్లాబ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందా?  పన్ను
    Halwa Ceremony: నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ భారతదేశం

    తెలంగాణ

    Sankranti: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగే ముక్కనుమ విశేషాలివే! సంక్రాంతి స్పెషల్
    Siddipet: కొండ పోచమ్మ సాగర్‌లో విషాదం.. ఏడుగురు యువకులు గల్లంతు హైదరాబాద్
    Rythu bharosa: రైతుభరోసాకు మార్గదర్శకాలు విడుదల.. ప్రతి ఎకరాకూ రూ.12 వేలు సాయం! ప్రభుత్వం
    New Liquor Brands: మద్యం కంపెనీల అనుమతులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025