NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / New Airports: రాష్ట్రంలో మరో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 2.27 కోట్లు విడుదల
    తదుపరి వార్తా కథనం
    New Airports: రాష్ట్రంలో మరో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 2.27 కోట్లు విడుదల
    రాష్ట్రంలో మరో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 2.27 కోట్లు విడుదల

    New Airports: రాష్ట్రంలో మరో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 2.27 కోట్లు విడుదల

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 13, 2024
    11:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల అభివృద్ధి కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనానికి రూ. 2.27 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

    ఈ విషయాన్ని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.

    కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలులో విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

    ఈ అభిప్రాయాలను ఇప్పటికే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు పంపినట్లు మంత్రి పేర్కొన్నారు.

    కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన భూముల వివరాలు కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.

    వివరాలు 

    రహదారుల పనులపై అధికారులు రోజువారీ పర్యవేక్షణ

    ఈ మేరకు, కుప్పంలో 1,501 ఎకరాలు, నాగార్జునసాగర్‌లో 1,670 ఎకరాలు, తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాలు, శ్రీకాకుళంలో 1,383 ఎకరాలు, తుని-అన్నవరంలో 787 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు.

    మరోవైపు, రహదారుల మరమ్మతులపై స్పందిస్తూ, సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్ల నిర్మాణం లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.

    రహదారుల పనులపై అధికారులు రోజువారీగా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

    ఈ మేరకు, మంగళవారం సచివాలయం నుండి మంత్రి ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

    ఇప్పటివరకు 506 పనులు ప్రారంభమయ్యాయని, 563 కి.మీ.లో గుంతలు పూడ్చినట్లు అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    ఆంధ్రప్రదేశ్

    AP : రహస్య జీవోలను బయటపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రభుత్వం
    AP Dwakra Mahilalu : డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ శుభవార్త.. పరిశ్రమల ఏర్పాటు- భారీ రాయితీతో రుణాలు భారతదేశం
    AP Govt: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీలో 32 మంది డిప్యూటీ కలెక్టర్ బదిలీ ఇండియా
    High Court: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం హైకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025