NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మోను మనేసర్‌ను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు 
    తదుపరి వార్తా కథనం
    మోను మనేసర్‌ను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు 
    మోను మనేసర్‌ను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు

    మోను మనేసర్‌ను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 12, 2023
    03:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల హత్యకు సంబంధించి, జూలైలో నుహ్‌లో హింసను ప్రేరేపించినందుకు గాను గో సంరక్షకుడు మోను మనేసర్‌ను హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఫిబ్రవరిలో హర్యానా కారులో మృతదేహాలు లభ్యమైన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తుల హత్య కేసులో బజరంగ్ దళ్ కార్యకర్త కీలక నిందితుడు.

    రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని ఒ గ్రామానికి చెందిన నసీర్(25), జునైద్(35)ను ఫిబ్రవరి 15న గోసంరక్షకులు అపహరించారు. మరుసటి రోజు, హర్యానా భివానీలోని లోహారులో నిప్పంటించిన కారులో వారి మృతదేహాలు కనుగొన్నారు.

    Details 

    నుహ్‌లో చెలరేగిన హింసాకాండను ప్రేరేపించిన మోను మనేసర్‌

    ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని బెయిలబుల్ సెక్షన్ల కింద మనేసర్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు హర్యానా పోలీసు వర్గాలు తెలిపాయి.

    సాయంత్రంలోగా అతనికి బెయిల్ లభించే అవకాశం ఉందని, జంట హత్యల కేసులో రాజస్థాన్ పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారని చెప్పారు.

    మోను మనేసర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు హర్యానా పోలీస్‌లు తమకి తెలియజేసారని,చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత,తాము తమ ప్రక్రియను ప్రారంభిస్తామని రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ మృదుల్ కచావా చెప్పారు.

    జులైలో హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసాకాండను ప్రేరేపించారని, ఇందులో కనీసం ఆరుగురు మరణించారని కూడా మనేసర్‌పై ఆరోపణలు ఉన్నాయి.

    జూలై 31న విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన 'బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర' సందర్భంగా హింస ప్రారంభమై, గురుగ్రామ్‌తో సహా పరిసర ప్రాంతాలకు వ్యాపించింది.

    Details 

    గత నెలలో అరెస్ట్ అయిన మానేసర్ సహాయకుడు

    మనేసర్ యాత్రకు హాజరయ్యారనే పుకార్లు మత ఘర్షణలకు కారణమయ్యాయి. హత్య కేసులో పరారీలో ఉన్న గోరక్షకుడు ఊరేగింపుకు కొన్ని రోజుల ముందు తాను హాజరవుతానని పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

    తన మద్దతుదారులను కూడా పెద్ద సంఖ్యలో బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

    ఇది ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొంతమందికి కోపం తెప్పించింది, వారు దీనిని ముప్పుగా భావించి సోషల్ మీడియాలో తీవ్రమైన వాగ్యుద్ధానికి ప్రేరేపించారు.

    మానేసర్ సహాయకుడు, బిట్టు బజరంగీ కూడా గత నెలలో హింసకు సంబంధించి అరెస్టయ్యాడు, తరువాత అతనికి బెయిల్ కూడా మంజూరు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా
    రాజస్థాన్

    తాజా

    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి
    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల

    హర్యానా

    హర్యానాలోని భివానీ జిల్లాలో దారుణం.. ఇద్దరు సజీవదహనం ప్రపంచం
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఎన్ఐఏ
    గురుగ్రామ్: కరోనాకు భయపడి మూడేళ్లుగా బయటికి రాకుండా ఇంట్లోనే తల్లీకొడుకులు కోవిడ్
    హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్ కర్ణాటక

    రాజస్థాన్

    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం
    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి యుద్ధ విమానాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025