TMC:టీఎంసీలో తిరుగుబాటు మొదలైందా?.. అభిషేక్ దాడిపై భాజపా సంచలన ఆరోపణలు!
ఈ వార్తాకథనం ఏంటి
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి వెనుక టీఎంసీ అంతర్గత విభేదాలే కారణమై ఉండవచ్చని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ నేత ప్రదీప్ భండారీ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'లో పలు వ్యాఖ్యలు చేశారు. 'అభిషేక్ బెనర్జీపై దాడికి టీఎంసీ అంతర్గత వర్గాలే కారణమా? ఈ కేసులో అరెస్టైన ఆరుగురు నిందితులు మాజీ ఎమ్మెల్యే లవ్లీ మొయిత్రాకు సన్నిహిత సహాయకులుగా ఉన్నారు. టీఎంసీ శ్రేణులే అభిషేక్కు వ్యతిరేకంగా మారాయా? బెంగాల్లో 'భాయ్పో'గా పిలిచే అభిషేక్పై ఎంతటి వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని ప్రదీప్ భండారీ పేర్కొన్నారు.
వివరాలు
కొన్నేళ్లుగా హింసాత్మక దాడులు
మరోవైపు పశ్చిమబెంగాల్ మంత్రి అగ్నిమిత్ర పౌల్ కూడా టీఎంసీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. అభిషేక్ బెనర్జీపై జరిగిన ఘటన టీఎంసీపై ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. 'ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో నిజమైన ప్రజాగ్రహం కనిపిస్తోంది. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, టీఎంసీ నాయకత్వం గత కొన్నేళ్లుగా హింసాత్మక రాజకీయాలకు పాల్పడింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు సహించరని ఆమె హెచ్చరించారు. హంతకులు ఎవరో ప్రజలకే తెలుసని అగ్నిమిత్ర పౌల్ పేర్కొన్నారు.
వివరాలు
వందలాదిమందిని హత్య చేశారు
''అభయా ఎలా మరణించింది? గత 15 ఏళ్లుగా మహిళలు ఎలాంటి హింసను ఎదుర్కొన్నారు? కమ్దునీ, పార్క్ స్ట్రీట్ ఘటనలను గుర్తు చేసుకోవాలి. మా పార్టీ కార్యకర్తలలో వందల మందిని హత్య చేసి చెట్లకు వేలాడదీశారు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి జట్టుగా పనిచేయాలని ఆమె వ్యాఖ్యానించారు.