NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాయల్ కుటుంబం పేరుతో లగ్జరీ హోటల్‌లో బస, రూ.23లక్షల బిల్లు ఎగ్గొట్టి పరార్
    తదుపరి వార్తా కథనం
    రాయల్ కుటుంబం పేరుతో లగ్జరీ హోటల్‌లో బస, రూ.23లక్షల బిల్లు ఎగ్గొట్టి పరార్
    లగ్జరీ హోటల్‌లో బస చేసి రూ.23లక్షల బిల్లు చెల్లించకుండా పరారైన యువకుడు

    రాయల్ కుటుంబం పేరుతో లగ్జరీ హోటల్‌లో బస, రూ.23లక్షల బిల్లు ఎగ్గొట్టి పరార్

    వ్రాసిన వారు Stalin
    Jan 17, 2023
    06:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో యూఏఈ రాజకుటుంబ సభ్యుడిగా నటిస్తూ మూడు నెలలకు పైగా అక్కడే ఉండి.. ఏకంగా రూ.23 లక్షలు బిల్లు చెల్లించకుండా పరారయ్యాడు ఓ యువకుడు. అతడిని మహమ్మద్ షరీఫ్ వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. ఆచూకీకోసం వెతుకున్నారు.

    గతేడాది ఆగస్టు 1 నుంచి నవంబర్ 20 వరకు అతడు హోటల్‌లో బస చేశాడు. యూఏఈలో ఒక ముఖ్యమైన ప్రభుత్వ అధికారి లాగే.. నకిలీ బిజినెస్ కార్డుతో లీలా ప్యాలెస్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. అతను హోటల్‌లో దిగాక.. అబుదాబి రాజకుటుంబానికి చెందిన షేక్ ఫలాహ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వద్ద తాను అధికారికా పనిచేశానని షరీఫ్ హోటల్ సిబ్బందికి చెప్పాడు.

    హోటల్

    నకిలీ చెక్కు ఇచ్చి, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడు

    నవంబర్ 20 వరకు ఆ హోటల్‌‌లో ఉన్న అతను ఆ తర్వాత రోజు చెల్లని చెక్కు ఇచ్చి కనిపించకుండా పారిపోయాడు. అతడు ఇచ్చిన చెక్కు నకిలీదని ఆ తర్వాత గుర్తించారు హోటల్ సిబ్బంది. అనంతరం మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.

    బిల్లు చెల్లించకుండా పారిపోవడమే కాకుండా హోటల్ గదిలోని వెండి వస్తువులు, ఇతర వస్తువులను కూడా ఆ యువకుడు దొంగిలించాడని పోలీసులు తెలిపారు.

    లీలా ప్యాలెస్‌ హోటల్‌లో షరీఫ్ మొత్తం ఖర్చు దాదాపు రూ. 35 లక్షలు కాగా.. అతను హోటల్‌లో దిగే ముందు రూ. 11.5 లక్షలు చెల్లించాడు. మిగతా సొమ్మును చెల్లించకుండానే పారిపోయాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025