NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాయల్ కుటుంబం పేరుతో లగ్జరీ హోటల్‌లో బస, రూ.23లక్షల బిల్లు ఎగ్గొట్టి పరార్
    భారతదేశం

    రాయల్ కుటుంబం పేరుతో లగ్జరీ హోటల్‌లో బస, రూ.23లక్షల బిల్లు ఎగ్గొట్టి పరార్

    రాయల్ కుటుంబం పేరుతో లగ్జరీ హోటల్‌లో బస, రూ.23లక్షల బిల్లు ఎగ్గొట్టి పరార్
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 17, 2023, 06:11 pm 0 నిమి చదవండి
    రాయల్ కుటుంబం పేరుతో లగ్జరీ హోటల్‌లో బస, రూ.23లక్షల బిల్లు ఎగ్గొట్టి పరార్
    లగ్జరీ హోటల్‌లో బస చేసి రూ.23లక్షల బిల్లు చెల్లించకుండా పరారైన యువకుడు

    దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో యూఏఈ రాజకుటుంబ సభ్యుడిగా నటిస్తూ మూడు నెలలకు పైగా అక్కడే ఉండి.. ఏకంగా రూ.23 లక్షలు బిల్లు చెల్లించకుండా పరారయ్యాడు ఓ యువకుడు. అతడిని మహమ్మద్ షరీఫ్ వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. ఆచూకీకోసం వెతుకున్నారు. గతేడాది ఆగస్టు 1 నుంచి నవంబర్ 20 వరకు అతడు హోటల్‌లో బస చేశాడు. యూఏఈలో ఒక ముఖ్యమైన ప్రభుత్వ అధికారి లాగే.. నకిలీ బిజినెస్ కార్డుతో లీలా ప్యాలెస్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. అతను హోటల్‌లో దిగాక.. అబుదాబి రాజకుటుంబానికి చెందిన షేక్ ఫలాహ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వద్ద తాను అధికారికా పనిచేశానని షరీఫ్ హోటల్ సిబ్బందికి చెప్పాడు.

    నకిలీ చెక్కు ఇచ్చి, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడు

    నవంబర్ 20 వరకు ఆ హోటల్‌‌లో ఉన్న అతను ఆ తర్వాత రోజు చెల్లని చెక్కు ఇచ్చి కనిపించకుండా పారిపోయాడు. అతడు ఇచ్చిన చెక్కు నకిలీదని ఆ తర్వాత గుర్తించారు హోటల్ సిబ్బంది. అనంతరం మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. బిల్లు చెల్లించకుండా పారిపోవడమే కాకుండా హోటల్ గదిలోని వెండి వస్తువులు, ఇతర వస్తువులను కూడా ఆ యువకుడు దొంగిలించాడని పోలీసులు తెలిపారు. లీలా ప్యాలెస్‌ హోటల్‌లో షరీఫ్ మొత్తం ఖర్చు దాదాపు రూ. 35 లక్షలు కాగా.. అతను హోటల్‌లో దిగే ముందు రూ. 11.5 లక్షలు చెల్లించాడు. మిగతా సొమ్మును చెల్లించకుండానే పారిపోయాడు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    దిల్లీ

    తాజా

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి
    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ

    దిల్లీ

    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు నరేంద్ర మోదీ
    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023