NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేటి నుంచి సర్కార్ బడి విద్యార్థులకు ఉచిత అల్పాహారం.. మెనూ వివరాలు ఇవే
    తదుపరి వార్తా కథనం
    నేటి నుంచి సర్కార్ బడి విద్యార్థులకు ఉచిత అల్పాహారం.. మెనూ వివరాలు ఇవే

    నేటి నుంచి సర్కార్ బడి విద్యార్థులకు ఉచిత అల్పాహారం.. మెనూ వివరాలు ఇవే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 06, 2023
    09:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలోని బడి పిల్లలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది.

    ఉదయం పూట విద్యార్థుల ఆకలి బాధలను తీర్చాలని భావించిన సర్కారు, ఈ అల్పాహార పథకాన్ని అమలు చేయనుంది.

    దసరా కానుకగా రాష్ట్రంలోని 28 వేలకుపైగా బడులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఫలితంగా 23,05,801 (23 లక్షల) మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

    ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో పాటు స్కూల్ డ్రాపౌట్లను తగ్గించేందుకు ఈ స్కీమ్ దోహదం చేయనుంది.

    రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని ఒక పాఠశాలలో నేడు లాంఛనంగా అల్పాహార పథకాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతనిధులు ప్రారంభించనున్నారు.

    details

    ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అల్పాహారం అందజేత

    దసరా సెలవులు పూర్తయ్యాక మిగిలిన పాఠశాలల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సబితా వివరించారు.

    ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని వర్తింపజేయనున్నారు.

    సోమ‌వారం - ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ ర‌వ్వ ఉప్మాతో చ‌ట్నీ

    మంగ‌ళ‌వారం- పూరి, ఆలు కుర్మ లేదా ట‌మాటా బాత్ ర‌వ్వ, చ‌ట్నీ

    బుధ‌వారం- ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చ‌ట్నీ

    గురువారం- మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగ‌ల్, సాంబార్

    శుక్రవారం- ఉగ్గాని లేదా పోహా లేదా మిల్లెట్ ఇడ్లీ, చ‌ట్నీ లేదా గోధుమ ర‌వ్వ కిచిడీ, చ‌ట్నీ

    శ‌నివారం - పొంగ‌ల్ సాంబార్ లేదా వెజిట‌బుల్ పులావ్, రైతా(మజ్జిగా) లేదా ఆలూ కుర్మాతో అల్పాహారం అందించనున్నారు.

    details

    తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకూ మధ్యాహ్నా భోజనంతో అదనంగా రూ.135 కోట్లు ఖర్చు

    ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.672 కోట్లను ఖర్చు చేస్తోంది.

    మరోవైపు దేశంలోనే తొలిసారిగా మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో ఆహారం, సహా వారానికి మూడు గుడ్లను ఇస్తున్నారు. సన్న బియ్యం కోసం రూ.187 కోట్లు, గుడ్ల కోసం మరో రూ.120 కోట్లను అదనంగా ఖర్చు పెడుతోంది.

    దేశవ్యాప్తంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుండగా, తెలంగాణలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ మేరకు అదనంగా రూ.135 కోట్లు ఖర్చు అవుతోంది.

    ఐరన్, మైక్రో మినరల్స్ కోసం విద్యార్థులకు రూ.32 కోట్లతో రాగి జావను అందజేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    Apple Games: ఆపిల్‌ నుంచి కొత్త గేమింగ్ యాప్ ఆవిష్కరణ.. 'ఆల్-ఇన్-వన్' ప్లాట్‌ఫారంగా మారే అవకాశం! ఆపిల్
    WWDC 2025: యాపిల్‌ watchOS 26 ఆవిష్కరణ.. లిక్విడ్ గ్లాస్ డిజైన్, జెస్టర్ కంట్రోల్స్ వంటి అధునాతన ఫీచర్లు! ఆపిల్
    Apple: యాపిల్ iPadOS 26 అధికారికంగా విడుదల.. డెస్క్‌టాప్ అనుభూతి, కొత్త డిజైన్, అపారమైన ఫీచర్లు  ఆపిల్
    macOS Tahoe: ఆపిల్ macOS Tahoe విడుదల.. కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్, మెరుగైన AI ఫీచర్లు! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    తెలంగాణ

    TSRTC Bill: ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు.. బిల్లును అమోదించిన గవర్నర్ శాసనసభ
    CM Kcr : మహిళలు, బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ బీఆర్ఎస్
    తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా.. అమరవీరులకు నివాళులు భారతదేశం
    తెలంగాణ: కాంగ్రెస్  విజయభేరి.. సోనియా గాంధీ ప్రకటించిన 6 హామీలు ఇవే  కాంగ్రెస్

    ప్రభుత్వం

    తెలంగాణ ఉద్యోగులకు సర్కారు వారి భారీ కనుక.. ఇళ్లు కట్టుకుంటే రూ.30 లక్షల అడ్వాన్స్ తెలంగాణ
    అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు తెలంగాణ
    తెలంగాణలో రూ.3500 కోట్లతో మెగా పెట్టుబడులు.. త్వరలోనే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం : లులూ సంస్థ తెలంగాణ
    ఓఆర్‌ఆర్‌పై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్.. దూసుకెళ్లనున్న వాహనాలు  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025