LOADING...
YS Avinash Reddy: జడ్పీటీసీ ఉపఎన్నికలో హైటెన్షన్‌.. వైసీపీ ఎంపీ అరెస్టు!
జడ్పీటీసీ ఉపఎన్నికలో హైటెన్షన్‌.. వైసీపీ ఎంపీ అరెస్టు!

YS Avinash Reddy: జడ్పీటీసీ ఉపఎన్నికలో హైటెన్షన్‌.. వైసీపీ ఎంపీ అరెస్టు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 12, 2025
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్‌ జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి పంపిన వెంటనే అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు అవినాష్‌రెడ్డి ఇంటి వద్దనే నిరసన చేపట్టారు. అలాగే, వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీశ్‌రెడ్డిని, పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Details

10,600 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం

ఈ ఎన్నికలను కూటమి, వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి. పోలింగ్‌ ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్‌ విధానంలో జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 1,500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఉపఎన్నికల్లో మొత్తం 10,600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.