NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హిమాచల్ విపత్తును జాతీయ విప‌త్తుగా ప్రకటించండి: సీఎం సుఖ్వీంద‌ర్ సింగ్ సుఖు
    తదుపరి వార్తా కథనం
    హిమాచల్ విపత్తును జాతీయ విప‌త్తుగా ప్రకటించండి: సీఎం సుఖ్వీంద‌ర్ సింగ్ సుఖు
    హిమాచల్ విపత్తును జాతీయ విప‌త్తుగా ప్రకటించండి: సీఎం సుఖ్వీంద‌ర్ సింగ్ సుఖు

    హిమాచల్ విపత్తును జాతీయ విప‌త్తుగా ప్రకటించండి: సీఎం సుఖ్వీంద‌ర్ సింగ్ సుఖు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 18, 2023
    06:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత కొద్ది రోజులగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్,రాష్ట్రంలో ఇప్పటివరకు 74మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.ఈ క్రమంలోనే చాలా చోట్ల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.

    ఎప్పుడు చూడని జ‌ల ప్రళయాన్నిహిమాచల్ రాష్ట్ర విప‌త్తుగాప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

    కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ ప్రళయాన్ని జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని సీఎం సుఖ్వీంద‌ర్ సింగ్ సుఖు శుక్ర‌వారంకోరారు. కేంద్ర ప్ర‌భుత్వ స్పంద‌న కోసం రాష్ట్రం వేచిచూస్తోంద‌ని తెలిపారు.

    సీఎం సుఖ్వీందర్‌ సుఖు మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యలను వేగవంతం చేశామని అలాగే ఇళ్లు కోల్పోయిన వారికి సాయం చేస్తున్నామన్నారు.

    ఈ వరదల కారణంగా రాష్ట్రానికి రూ.10వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామని సుఖు తెలిపారు.

    Details 

    ఆలయ శిథిలాల క్రింద మరో ఆరు మృతదేహాలు 

    షిమ్లా ప్రాంతంలోని సమ్మర్‌హిల్‌లో శివాలయం నేలకూలి ఘటనలో శిథిలాల కింద నుంచి ఇవాళ మరో మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికితీశాయి.

    షిమ్లాలోనే మొత్తంగా మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడి 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ సంజీవ్‌కుమార్‌ గాంధీ పేర్కొన్నారు.

    ఇంకా ఆలయ శిథిలాల క్రింద ఆరు మృతదేహాలుండొచ్చని భావిస్తున్నారు. వర్షాకాలం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో 217 మంది ప్రాణాలు కోల్పోయారు.

    11,301 ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండటంతో 506 రహదారుల్లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

    కాంగ్రా జిల్లాలో వరదలు సంభవించిన నేపథ్యంలో గత మూడు రోజుల్లోనే 2,074 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హిమాచల్ ప్రదేశ్
    సుఖ్విందర్ సింగ్ సుఖ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    హిమాచల్ ప్రదేశ్

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం

    సుఖ్విందర్ సింగ్ సుఖ్

    భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో రూ.10వేల కోట్ల నష్టం: సీఎం సుఖ్వీందర్ హిమాచల్ ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025