NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Metro: హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Metro: హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు!
    హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు!

    Metro: హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 17, 2025
    10:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో చార్జీల భారం తప్పక పోవచ్చని అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

    జంటనగరాల పరిధిలో రోజూ లక్షలాది మంది పౌరులు మెట్రో రైలు సేవలను ఉపయోగిస్తున్నారు.

    తీవ్ర రహదారి ట్రాఫిక్‌, పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తట్టుకోలేక చాలా మంది ప్రజలు మెట్రో రైలు వైపు మొగ్గుచూపుతున్నారు.

    ఇలాంటి సమయంలో హైదరాబాద్ మెట్రో రైల్‌ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు వేగంగా చక్కర్లు కొడుతున్నాయి.

    వివరాల్లోకి వెళితే, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ (L&T) రూ.6,500 కోట్లకు పైగా నష్టాలను చవిచూసినట్టు ఇటీవల ప్రకటించింది.

    వివరాలు 

    ఫేర్ ఫిక్సేషన్ కమిటీ నియామకం 

    కోవిడ్-19 మహమ్మారి సమయంలో తీవ్ర ఆర్థిక నష్టాలు వాటిల్లిన నేపథ్యంలో, 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో చార్జీలను పెంచేలా కేంద్రాన్ని కోరింది.

    దీనిపై స్పందించిన కేంద్రం, మెట్రో రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్-2002 ప్రకారం ఓ ఫేర్ ఫిక్సేషన్ కమిటీని (FFC) నియమించింది.

    ఈ కమిటీ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ప్రతిపాదనలు, అలాగే ప్రయాణికుల అభిప్రాయాలను పరిశీలించింది.

    అనంతరం మెట్రో చార్జీల పెంపుకు అంగీకారం తెలిపింది. అయితే, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పెంపును ఆమోదించకుండా తిరస్కరించింది.

    వివరాలు 

    రద్దీ సమయాల్లో ఇచ్చే 10 శాతం డిస్కౌంట్‌ తొలగింపు 

    ఇప్పటి పరిస్థితుల్లో, ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాలతో సతమతమవుతుండటంతో.. మెట్రో ఛార్జీలు పెరగటం తథ్యంగా కనిపిస్తోంది.

    ఇక ఇటీవల బెంగళూరు మెట్రో ఛార్జీలు 44 శాతం వరకు పెరిగినట్టు సమాచారం.

    ఈ పరిణామాల నేపథ్యంగా హైదరాబాద్ మెట్రోలో కనిష్ట ఛార్జీ రూ.10గా, గరిష్ట ఛార్జీ రూ.60గా ఉన్నప్పటికీ.. భవిష్యత్‌లో ఎంతవరకు పెరుగుతాయన్న స్పష్టత ఇంకా లేదు.

    ఇదిలా ఉంటే, ఇప్పటికే మెట్రో సంస్థ రూ.59 విలువైన హాలిడే సేవర్ కార్డును రద్దు చేసింది.

    అంతేకాదు, రద్దీ సమయాల్లో ఇచ్చే 10 శాతం డిస్కౌంట్‌ను కూడా తొలగించిన సంగతి తెలిసిందే.

    ఈ పరిస్థితులన్నీ కలిసి చూస్తే, నగర వాసులకు మెట్రో ప్రయాణం ఖరీదైనదిగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మెట్రో రైలు

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    మెట్రో రైలు

    Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై సీఎం సంచలన నిర్ణయం.. రాయదుర్గం-శంషాబాద్‌ ప్రాజెక్టు నిలిపివేత హైదరాబాద్
    Hyderabad: న్యూ ఇయర్ స్పెషల్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు  హైదరాబాద్
    Airport Metro Rail: చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్‌ హైదరాబాద్
    Hyderabad Metro: 70 కిలోమీటర్లలో హైదరాబాద్ మెట్రో విస్తరణ.. రూట్ మ్యాప్ ఖరారు  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025