NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేరళలో భారత ఆర్మీ జవాన్‌పై దాడి..పెయింట్ తో  వీపుపై PFI అని రాతలు 
    తదుపరి వార్తా కథనం
    కేరళలో భారత ఆర్మీ జవాన్‌పై దాడి..పెయింట్ తో  వీపుపై PFI అని రాతలు 
    కేరళలో భారత ఆర్మీ జవాన్‌పై దాడి..పెయింట్ తో వీపుపై PFI అని రాతలు

    కేరళలో భారత ఆర్మీ జవాన్‌పై దాడి..పెయింట్ తో  వీపుపై PFI అని రాతలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 25, 2023
    03:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలోని కొల్లాం జిల్లాలో భారత ఆర్మీ సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వీపుపై 'PFI' అని పెయింట్‌తో రాశారు.

    ఈ సందర్భంగా ఆర్మీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి కడక్కల్‌లోని తన ఇంటి పక్కనే ఉన్న రబ్బరు అడవిలో ఆరుగురు వ్యక్తుల బృందం తనపై దాడి చేసిందని ఆర్మీ సిబ్బంది షైన్ కుమార్ తన ఫిర్యాదులో తెలిపారు.

    వారు అతని చేతులను టేప్‌తో కట్టివేసి, ఆకుపచ్చ పెయింట్‌తో అతని వీపుపై PFI అని రాశారు.

    షైన్ కుమార్ ఫిర్యాదు మేరకు కడక్కల్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని 143,147, 323, 341, 153 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    Details 

    గత ఏడాది సెప్టెంబర్‌లో PFI ని నిషేదించిన కేంద్ర ప్రభుత్వం 

    మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్‌ఎ)కింద నిషేధించబడిన పిఎఫ్‌ఐపై దర్యాప్తునకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి)కేరళలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన రోజునే ఈ సంఘటన జరగడం గమనార్హం.

    పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఇస్లామిస్ట్ సంస్థ PFI, జాతీయ దర్యాప్తు సంస్థ,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్కానర్ కిందకు వచ్చిన తరువాత గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

    గ్లోబల్ టెర్రర్ గ్రూపులు,టెర్రర్ ఫండింగ్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించినందుకు ఈ సంస్థపై ఐదేళ్ల పాటు నిషేధం విధించబడింది.

    నోటిఫికేషన్‌లో, పిఎఫ్‌ఐ అనేక క్రిమినల్,టెర్రర్ కేసులలో ప్రమేయం ఉందని, బయటి నుండి నిధులు,సైద్ధాంతిక మద్దతుతో దేశంలోని రాజ్యాంగ అధికారం పట్ల పూర్తి అగౌరవాన్ని ప్రదర్శిస్తుందని, ఇది దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా మారిందని కేంద్రం పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కేరళ

    కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి  తాజా వార్తలు
    కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ 4న వచ్చే అవకాశం: ఐఎండీ ఐఎండీ
    'ది కేరళ స్టోరీ'పై బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధంపై సుప్రీంకోర్టు స్టే  సినిమా
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025