
Atishi: దిల్లీ సీఎం ఆతిశీపై పరువు నష్టం పిటిషన్.. ఎన్నికల వేళ సీఎంకి ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
అసెంబ్లీ ఎన్నికల సమీపంలో,దిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనాకి (Atishi) ఊరట లభించింది. ఆమెపై బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం కేసును నగరంలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. న్యాయస్థానం, ఆమెది మొత్తం పార్టీపై చేసిన వ్యాఖ్య అని, ఒక్క వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడలేదని స్పష్టం చేసింది. దీంతో ఆమెకు ఈ కేసులో ఉపశమనం లభించింది. గతేడాది లోక్సభ ఎన్నికల ముందు, ఆతిశీ భాజపాపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. "మా పార్టీలో చేరకపోతే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆప్ నేతలను అరెస్టు చేస్తుంది" అని కాషాయ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు బెదిరించారని ఆమె ఆరోపించారు. దీంతో, బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది.
వివరాలు
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు
అదే సమయంలో, ఆమెపై పరువునష్టం పిటిషన్ కూడా దాఖలు చేయబడింది. కోర్టు ఈ కేసు విచారణ చేసాక, ఆతిశీ బీజేపీను ఉద్దేశించి మాట్లాడినట్లు, కానీ వ్యక్తిగతంగా కాకుండా పార్టీపై వ్యాఖ్యానించారని పిటిషన్ను కొట్టివేసింది. ప్రస్తుతం, దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది, 8న ఫలితాలు వెలువడనున్నారు. CM ఆతిశీ, కల్కాజీ స్థానం నుంచి మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.