Loading...
Corona cases: కొత్తగా 743 మందికి కరోనా.. ఏడుగురు మృతి 
Corona cases: కొత్తగా 743 మందికి కరోనా.. ఏడుగురు మృతి

Corona cases: కొత్తగా 743 మందికి కరోనా.. ఏడుగురు మృతి 

వ్రాసిన వారు Stalin
Dec 30, 2023
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 743 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,997కి చేరుకుంది. ఇదిలా ఉంటే, దేశంలో కరోనాతో కొత్తగా ఏడుగురు మరణించారు. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, ఛత్తీస్‌గఢ్, తమిళనాడులో ఒకరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణాలు 5,33,358కి పెరిగాయి. డిసెంబర్ 29న 41,797 పరీక్షలు చేశారు. దేశంలో ఇప్పటి వరకు JN.1 సబ్‌వేరియంట్ కేసులు 145 కేసులు నమోదయ్యాయి. JN.1 సబ్‌వేరియంట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక వ్యాఖ్యలు చేసింది. JN.1 సబ్‌వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని పేర్కొంది.

embed

యాక్టివ్ కేసులు 3,997 

ADVERTISEMENT