Loading...
UNSC: భద్రతా మండలిలో చోటు కోసం భారత్ ప్రయత్నాలు.. ప్రచారానికి శ్రీకారం
భద్రతా మండలిలో చోటు కోసం భారత్ ప్రయత్నాలు.. ప్రచారానికి శ్రీకారం

UNSC: భద్రతా మండలిలో చోటు కోసం భారత్ ప్రయత్నాలు.. ప్రచారానికి శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ)లో 2028-2029 కాలానికి శాశ్వతేతర సభ్యత్వం దక్కించుకునేందుకు భారత్ అధికారికంగా తన ప్రచారాన్ని ప్రారంభించింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

వివరాలు 

ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

"#India4UNSC: Peace,Planet,Progress" అనే నినాదంతో ఈ ప్రచారాన్ని భారత్ నిర్వహిస్తోంది.

ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని అంతర్జాతీయ వేదికపై బలంగా వినిపించాలన్నదే ఈ ప్రచారం ప్రధాన ఉద్దేశమని భారత ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు, ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఆహారం, ఎరువులు, ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడి అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలకు భద్రతా మండలిలో తగిన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని భారత్ తన ప్రచారంలో స్పష్టం చేస్తోంది.

వివరాలు 

భారత్‌కు మద్దతుగా ఈ దేశాలు 

శాశ్వతేతర సభ్యత్వానికి సంబంధించిన ఎన్నికలు వచ్చే ఏడాది జూన్‌లో జరిగే అవకాశం ఉంది.

ఆసియా-పసిఫిక్ విభాగానికి కేటాయించిన ఒకే ఒక్క స్థానానికి భారత్‌తో పాటు తాజికిస్థాన్ కూడా పోటీ పడుతోంది.

ఇప్పటికే అమెరికా, ఆస్ట్రియా, శ్రీలంక, ఫిజీ వంటి దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటించాయి.

అయితే 57 సభ్య దేశాలతో కూడిన ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) మద్దతు తాజికిస్థాన్‌కు ఉండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

దీంతో ఆఫ్రికా, కరేబియన్, మధ్య ఆసియా దేశాల మద్దతు కోసం భారత్ రాబోయే నెలల్లో తన దౌత్య ప్రయత్నాలను మరింత వేగవంతం చేయనుంది.

ADVERTISEMENT

వివరాలు 

2021-2022 కాలంలో భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా భారత్

ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల అవసరాన్ని భారత్ మరోసారి ప్రస్తావించింది.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రపంచ నిర్ణయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు.

1945 నుంచి పెద్దగా మార్పులు లేకుండా కొనసాగుతున్న భద్రతా మండలి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా లేదని, విస్తృత ప్రాతినిధ్యం కల్పించినప్పుడే ఐక్యరాజ్యసమితి మరింత సమర్థవంతంగా పనిచేయగలదని భారత్ వాదిస్తోంది.

భారత్ చివరిసారిగా 2021-2022 కాలంలో భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా సేవలందించింది.

ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే 2028-2029 కాలానికి మరోసారి భద్రతా మండలిలో సభ్యత్వం పొందనుంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భద్రతా మండలిలో చోటు కోసం భారత్ ప్రయత్నాలు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భద్రతా మండలిలో చోటు కోసం భారత్ ప్రయత్నాలు

ADVERTISEMENT