NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bangladesh: బంగ్లాదేశ్‌'లో హిందువులు, మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాం: విదేశాంగ కార్యదర్శి
    తదుపరి వార్తా కథనం
    Bangladesh: బంగ్లాదేశ్‌'లో హిందువులు, మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాం: విదేశాంగ కార్యదర్శి
    బంగ్లాదేశ్‌'లో హిందువులు, మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాం: విదేశాంగ కార్యదర్శి

    Bangladesh: బంగ్లాదేశ్‌'లో హిందువులు, మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాం: విదేశాంగ కార్యదర్శి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 09, 2024
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత కార్యదర్శి విక్రమ్ మిశ్రి బంగ్లాదేశ్‌కు చేసిన పర్యటన ప్రముఖ ప్రాధాన్యతను సంతరించుకుంది.

    ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు తీవ్రత చెందడంతో, వీటిని పరిష్కరించడానికి మిశ్రి బంగ్లాదేశ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.

    బంగ్లాదేశ్ విదేశాంగశాఖ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్, విదేశాంగశాఖ సలహాదారుతో తౌహిద్ హుస్సేన్‌తో జరిగిన చర్చల్లో, బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల భద్రతపై మిశ్రి ఆందోళన వ్యక్తం చేశారు.

    బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన సంఘటనలపై, ముఖ్యంగా ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్‌ అరెస్ట్ గురించి వారు చర్చించారని మిశ్రి మీడియాతో పేర్కొన్నారు.

    అలాగే, బంగ్లాదేశ్ దళాలు భారత సరిహద్దుల్లో డ్రోన్లను మోహరించిన విషయాన్ని కూడా చర్చించినట్లు తెలిపారు.

    వివరాలు 

    చిన్మయ్ కృష్ణదాస్‌ అరెస్టుతో మరింత ఉద్రిక్తత

    భారతదేశం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటోందని, బంగ్లాదేశ్‌లోని యూనస్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారని మిశ్రి తెలిపారు.

    బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత, బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు మరింత పెరిగాయి.

    ముఖ్యంగా, ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ అరెస్టుతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది.

    ఆయనకు న్యాయసాయం అందించడంపై కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

    ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్‌ ఇద్దరు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకున్నట్లు సమాచారం.

    వీరు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢాకా నుండి పనిచేయాలని సూచించబడినట్లు తెలిసింది. దీని వల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్

    తాజా

    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ
    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్! ప్రభాస్
    PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన నరేంద్ర మోదీ
    Sana Yousuf: పాకిస్థాన్‌లో దారుణం.. సోషల్ మీడియా స్టార్‌ను ఇంట్లోనే కాల్చి చంపారు సోషల్ మీడియా

    బంగ్లాదేశ్

    Khaleda Zia: ఆసుపత్రిలో చేరిన బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. 2021లో లివర్ సిర్రోసిస్‌గా నిర్ధారణ  అంతర్జాతీయం
    Bangladesh: భార‌త్‌తో టెస్టు సిరీస్‌..జ‌ట్టును ప్ర‌క‌టించిన బంగ్లాదేశ్‌ క్రీడలు
    Ind Vs Ban: విజృంభించిన భార‌త బౌల‌ర్లు.. బంగ్లాదేశ్ 149 ఆలౌట్‌.. క్రీడలు
    Team India: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025